HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Ap Assembly Committees Election Pac Chairman Election Ap

PAC members Polling : పెద్దిరెడ్డిని బకరాను చేసి అవమానించిన జగన్..?

ప్రజాపద్దులు(పీఏసీ ), అంచనాలు(ఎస్టిమేట్స్‌), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్‌ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.

  • By Latha Suma Published Date - 12:32 PM, Fri - 22 November 24
  • daily-hunt
ap-assembly-committees-election-pac-chairman-election-ap
ap-assembly-committees-election-pac-chairman-election-ap

AP Assembly : అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో (పీఏసీ) సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్‌ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్‌లకు బాధ్యత అప్పగించింది. ప్రజాపద్దులు(పీఏసీ ), అంచనాలు(ఎస్టిమేట్స్‌), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్‌ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.

కాగా, అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం10 చొప్పున నామినేషన్లు దాఖలవ్వటంతో పోలింగ్‌ అనివార్యమైంది. ఛైర్మన్లుగా పీఏసీకి పులపర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీకి జోగేశ్వర రావు, పీయూసీకి కూన రవికుమార్‌‌ల ఎన్నిక దాదాపు ఖరారు చేశారు.

మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా పద్దుల కమిటీ సభ్యుల ఎన్నికలను బహిష్కరించింది. ఈరోజు జరగాల్సిన ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. నామినేషన్లు వేసి ఎన్నికల్ని బహిష్కరించిన పెద్దిరెడ్డి. ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేయడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం తీరు వల్లే తాము పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు.

ఇకపోతే.. ఈ ఎన్నికలకు వైఎస్‌ జగన్‌ ఓటేయకుండా అవమానిస్తూ బెంగుళూరుకు వెళ్లినట్లు తెలుస్తుంది. అసలు సంఖ్యాబలం లేదని తెలిసీ..నామినేషన్ వెయ్యించడం ఎందుకు..? ఓటింగ్ సమయానికి ఇలా బెంగుళూరులోని ప్యాలసుకు ప్రయాణం పెట్టుకొని ఇలా అవమానించడం ఎందుకు..? అంతా పిల్ల చేష్టల్లా వుంది. ఏదో మనసులో పెట్టుకొని పెద్దిరెడ్డిని వైఎస్‌ జగన్‌ మోసం చేస్తున్నారు..పెద్దిరెడ్డిని బకరాను చేసి అవమానించిన జగన్ అంటూ ఎస్‌ఆర్‌సీపీ సర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

కాగా, గతంలో అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉన్న సంప్రదాయాల ప్రకారం విపక్ష సభ్యులకు పీఏసీ ఛైర్మన్ పగ్గాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం విపక్షానికి సంఖ్యా బలం లేదన్న సాకు చూపి పీఏసీకి ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్ని తాము బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించే పీఏసీ పదవిని విపక్షాలకు ఇస్తారని, కేవలం ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్లు తప్ప ఎవరూ ఇలా చేయరని పెద్దిరెడ్డి కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు.

Read Also: Posani Krishna Murali: పోసాని షాకింగ్ నిర్ణయం.. ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • MLA Peddireddy Ramachandra Reddy
  • PAC Chairman Election
  • PAC members Polling
  • ys jagan
  • ysrcp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Kuppam

    Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్‌!

Latest News

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd