HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap Assembly Committees Election Pac Chairman Election Ap

PAC members Polling : పెద్దిరెడ్డిని బకరాను చేసి అవమానించిన జగన్..?

ప్రజాపద్దులు(పీఏసీ ), అంచనాలు(ఎస్టిమేట్స్‌), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్‌ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.

  • By Latha Suma Published Date - 12:32 PM, Fri - 22 November 24
  • daily-hunt
ap-assembly-committees-election-pac-chairman-election-ap
ap-assembly-committees-election-pac-chairman-election-ap

AP Assembly : అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో (పీఏసీ) సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్‌ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్‌లకు బాధ్యత అప్పగించింది. ప్రజాపద్దులు(పీఏసీ ), అంచనాలు(ఎస్టిమేట్స్‌), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్‌ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.

కాగా, అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం10 చొప్పున నామినేషన్లు దాఖలవ్వటంతో పోలింగ్‌ అనివార్యమైంది. ఛైర్మన్లుగా పీఏసీకి పులపర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీకి జోగేశ్వర రావు, పీయూసీకి కూన రవికుమార్‌‌ల ఎన్నిక దాదాపు ఖరారు చేశారు.

మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా పద్దుల కమిటీ సభ్యుల ఎన్నికలను బహిష్కరించింది. ఈరోజు జరగాల్సిన ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. నామినేషన్లు వేసి ఎన్నికల్ని బహిష్కరించిన పెద్దిరెడ్డి. ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేయడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం తీరు వల్లే తాము పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు.

ఇకపోతే.. ఈ ఎన్నికలకు వైఎస్‌ జగన్‌ ఓటేయకుండా అవమానిస్తూ బెంగుళూరుకు వెళ్లినట్లు తెలుస్తుంది. అసలు సంఖ్యాబలం లేదని తెలిసీ..నామినేషన్ వెయ్యించడం ఎందుకు..? ఓటింగ్ సమయానికి ఇలా బెంగుళూరులోని ప్యాలసుకు ప్రయాణం పెట్టుకొని ఇలా అవమానించడం ఎందుకు..? అంతా పిల్ల చేష్టల్లా వుంది. ఏదో మనసులో పెట్టుకొని పెద్దిరెడ్డిని వైఎస్‌ జగన్‌ మోసం చేస్తున్నారు..పెద్దిరెడ్డిని బకరాను చేసి అవమానించిన జగన్ అంటూ ఎస్‌ఆర్‌సీపీ సర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

కాగా, గతంలో అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉన్న సంప్రదాయాల ప్రకారం విపక్ష సభ్యులకు పీఏసీ ఛైర్మన్ పగ్గాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం విపక్షానికి సంఖ్యా బలం లేదన్న సాకు చూపి పీఏసీకి ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్ని తాము బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించే పీఏసీ పదవిని విపక్షాలకు ఇస్తారని, కేవలం ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్లు తప్ప ఎవరూ ఇలా చేయరని పెద్దిరెడ్డి కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు.

Read Also: Posani Krishna Murali: పోసాని షాకింగ్ నిర్ణయం.. ఇక జీవితంలో రాజకీయాలపై మాట్లాడను..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • MLA Peddireddy Ramachandra Reddy
  • PAC Chairman Election
  • PAC members Polling
  • ys jagan
  • ysrcp

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

    Latest News

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd