Basara: బాసరలో మరో విషాదం.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
- By Balu J Published Date - 06:48 PM, Fri - 23 February 24
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో గురువారం రాత్రి శిరీష (17) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దావూరు గ్రామానికి చెందిన శిరీష ఈ విద్యా సంవత్సరమే ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనానికి వెళ్లి వచ్చిన విద్యార్థులు హాస్టల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండడం గమనించి షాక్కు గురయ్యారు.
శిరీష వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఒత్తిడితోనా? లేని పక్షంలో మరే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాగా, తన బావ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఆ విషాదాన్ని తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శిరీష ఘటనాస్థలంలో ఉంచిన సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఇది ఐదో ఆత్మహత్య ఘటన.
Related News
Basara: ఐఐఐటీ బాసర క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య
Basara: తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర పట్టణంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT) విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బి. అరవింద్ (17) ఐఐఐటి బాసర అని కూడా పిలువబడే RGUKT క్యాంపస్లోని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జి