Angry Farmers: రైతన్న కన్నెర్ర…!!
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్వింటాల్ ధాన్యాన్ని కేవలం రూ. 1200 నుంచి రూ.1400 వరకు ఇస్తుండటంతో రైతులు కన్నెర్ర చేశారు.
- By Hashtag U Published Date - 02:08 AM, Sun - 10 April 22
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్వింటాల్ ధాన్యాన్ని కేవలం రూ. 1200 నుంచి రూ.1400 వరకు ఇస్తుండటంతో రైతులు కన్నెర్ర చేశారు. రైతులు కాంటా మిషన్లను ధ్వంసం చేశారు. వరి డంపులకు నిప్పంటించారు. మార్కెట్ యార్డు కార్యాలయానికి తాళం వేశారు. శుక్రవారం క్వింటాల్ ధాన్యం ధర రూ. 1800 ఉంటే..ఒక్కరోజులోనే వరి ధర క్వింటాల్ కు రూ. 1200కి ఎలా పడిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు. సన్న రకాల ధాన్యాన్ని కూడా క్వింటాలుకు రూ. 1200 నుంచి 1400 మధ్య కొనుగోలు చేయడంపై రైతులు మండిపడ్డారు.
ఈ ఖరీఫ్ కాలంలో క్వింటాల్ కు మద్దతు ధర రూ. 1960లకు వరి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. యాసంగి పంట సీజన్ కు వరి కొనుగోళ్లు నిలిచిపోవడంతో…వరిధాన్యం ధర రోజురోజుకూ పడిపోతోంది. ఒక్కరోజులోనే క్వింటాల్ కు 600రూపాయలు పతనం కావడంతో రైతులు తీవ్ర నిరాశాకు గురయ్యారు. ఉన్నతాధికారులు మార్కెట్ యార్డుకు వచ్చేంత వరకు వరిధాన్యం కొనుగోలు నిలిపివేయాలంటూ వ్యాపారులు కోరారు. దీంతో రైతులు తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై వారికి అనుకూలంగా మలుచుకుని వరిధాన్యాన్ని తగ్గించారని ఆరోపించారు. మద్దతు ధర పెంచిన తర్వాతే..కొనుగోళ్లు చేపట్టాలని రైతులు నిరసనకు దిగారు. రైతుల ఆందోళనతో కొనుగోళ్లు మొత్తంకూడా నిలిచిపోయాయి. కనీస ధర రూ. 1700నుంచి రూ. 1800 వరకు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Related News
Good News To Farmers : రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసిన తెలంగాణ సర్కార్
స్వాతంత్య్ర దినోత్సవానికి ఓ రోజు ముందే తెలంగాణ రైతుల్లో ఆనందం నింపారు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)..కేసీఆర్ సారు..రుణమాఫీ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్న రైతుల ముఖంలో వెలుగు నింపారు. రైతుల రుణమాఫీ (farmers’ loan waiver scheme) చేస్తానని చెప్పినట్లే కేసీఆర్..ఈరోజు సోమవారం రూ.లక్షలోపు ఉన్న వారి రుణమాఫీ చేసారు. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. సీఎం క�