HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Allu Arjun Uncle Will Be Join In Congress

Allu Arjun : కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ..

  • By Kavya Krishna Published Date - 12:31 PM, Fri - 16 February 24
  • daily-hunt
Kancharla Chandrashekar Reddy
Kancharla Chandrashekar Reddy

తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే నెలలో పార్లమెంట్‌ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందకు ఆసక్తిగా ఉన్న నేతలు పావులు కదుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు కాంగ్రెస్‌ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అంతేకాకుండా.. కొందరు బాహటంగా కాంగ్రెస్‌(Congress) లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే.. తాజాగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandra Shekar Reddy) ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ (BRS)లో ఉన్న ఆయన ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఎంపీగా పోటీ చేస్తే అల్లుడు అర్జున్ ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా.. తన గెలుపునకు ఆయన తప్పకుండా కృషి చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఆ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) కుటుంబాన్ని ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి (Sunitha Reddy) ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల ఎంపీ టికెట్‌ హామీ ఇవ్వడంతో సునీతారెడ్డి కుటుంబం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైంది. తెలంగాణ పునర్నిర్మాణానికి సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీతారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి, ఆమె కుమారుడు రినీషారెడ్డి తమ అనుచరులతో కలిసి అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు. శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పాదయాత్రలో పాల్గొననున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మహేందర్ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. కాగా, జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆమె గతంలో రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేసి ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు పట్నం కుటుంబం కాంగ్రెస్‌లో చేరాలని భావించినా, కేసీఆర్ వారిని ఒప్పించలేకపోయారు. అందుకే సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనికి తోడు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్లలో ఒకరు ఈరోజు కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Read Also : ISRO : GSLV F-14 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • breaking news
  • kanchara chandrashekar reddy
  • Latest News
  • telugu news

Related News

Minister Lokesh

Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

  • Sadar Sammelan

    Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • Minister Lokesh

    Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

  • TTD Chairman

    TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

Latest News

  • Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

  • CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

  • H-1B Visa Fee : H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్

  • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

  • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd