Actor Unni Mukundan: మోదీతో భేటీ అయిన మలయాళ నటుడు
మలయాళ సినీ నటుడు ముకుందన్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:58 PM, Tue - 25 April 23
Actor Unni Mukundan: మలయాళ సినీ నటుడు ముకుందన్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి, కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కేరళలోని తిరువునంతపురం రైల్వే స్టేషన్ లో జెండా ఊపి వందే భారత్ ఎక్స్ రైలుని ప్రారంభించారు. అలాగే వాటర్ మెట్రోని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కేరళ సంప్రదాయంలో దర్శనమిచ్చారు. కేరళ సాంప్రదాయ వస్త్రధారణలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ముకుంద తో భేటీ అయ్యారు. కొంత సేపు ఇష్ఠాగోష్టీగా మాట్లాడుకున్నారు. మోదీతో దిగిన ఫోటోలను నటుడు ట్విట్టర్ లో షేర్ చేశాడు.
14 సంవత్సర వయస్సులో మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు ముకుందన్. మీతో భేటీ అవ్వడం నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. మీతో మాట్లాడిన 45 నిమిషాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీరిచ్చిన సలహాలు పాటిస్తాను అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే ఈ భేటీలో ప్రధానికి ముకుంద బహుమతి ప్రధానం చేశారు. శ్రీకృష్ణుడు విగ్రహాన్ని మోదీకి బహుకరించారు.
This is the most electrifying post from this account!🔥Thank you sir, from seeing you afar as a 14 year old and now finally Meeting you, I’m yet to recover! Your, “Kem cho Bhaila” on stage literally shook me up! It was one big dream that I had to meet u & talk to you in Gujarati! pic.twitter.com/5HbSZWwtkB
— Unni Mukundan (@Iamunnimukundan) April 24, 2023
22 సెప్టెంబర్ 1987న ముకుందన్ జన్మించారు. మలయాళంలో నటుడు, నిర్మాత మరియు గాయకుడిగా కొనసాగుతున్నాడు. ముకుందన్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.
Read More: YCP-TDP :దళిత కార్డ్ తీసిన జగన్ !CBN టార్గెట్
Related News
KTR: మోడీపై కేటీఆర్ ప్రశ్నల వర్షం.. పిరమైన ప్రధాని అంటూ సెటైర్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణకు వస్తున్న సందర్భంగా బీజేపీని టార్గెట్ చేస్తూ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. ప్రధానిగా పదేళ్లు గడిచినా..తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి, ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు..