POK Clashes : అట్టుడుకుతున్న పీఓకే.. పోలీసు అధికారి మృతి, 90 మందికి గాయాలు
POK Clashes : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అట్టుడుకుతోంది.
- By Pasha Published Date - 11:45 AM, Sun - 12 May 24
![POK Clashes : అట్టుడుకుతున్న పీఓకే.. పోలీసు అధికారి మృతి, 90 మందికి గాయాలు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/POK-Clashes.jpg)
POK Clashes : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అట్టుడుకుతోంది. నిత్యావసరాల ధరల మంట, అధిక పన్నుల భారం, విద్యుత్ కోతల కారణంగా స్థానికులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘ఆజాదీ’ (స్వేచ్ఛ) నినాదాలు చేస్తూ నిరసనకారులు ధర్నాలకు దిగుతున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి నిరసనకారులతో జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, 90 మంది గాయపడ్డారు. పోలీసులు, భద్రతా బలగాలకు చెందిన పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో పాక్ ఆర్మీ భారీసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించి ఎక్కడికక్కడ నిరసనకారులను అణచివేస్తున్నట్లు తెలుస్తోంది. పీఓకే (POK Clashes) పరిధిలోని ముజఫరాబాద్, మీర్పూర్ ఇతర జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని సమాచారం. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పీఓకేలో గత శుక్రవారం నుంచి నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 200 మంది నిరసనకారులను పాక్ పోలీసులు అరెస్టు చేసి జైళ్లలో వేశారు.
We’re now on WhatsApp. Click to Join
మీర్పూర్ జిల్లాలోని దద్యాల్ నగరంలో శుక్రవారం రోజు శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా పీఓకే అంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. ముజఫరాబాద్లో పూర్తిగా బంద్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడి దుకాణ సముదాయాలన్నీ మూతపడ్డాయి. ఇక పీఓకే ప్రజలు ఆజాదీ నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ 2023 ఆగస్టులో కూడా ఇదే విధమైన నిరసన కార్యక్రమాలను నిర్వహించింది.
Also Read :Mothers Day 2024 : సండే రోజే ‘మదర్స్ డే’ ఎందుకు నిర్వహిస్తారు ?
‘‘విద్యుత్ బిల్లులపై భారీగా పన్నులను విధించడాన్ని మేం తిరస్కరిస్తున్నాం. ఈ ప్రాంతంలోని హైడల్ విద్యుత్ ఉత్పత్తి ధరకు అనుగుణంగా వినియోగదారులకు విద్యుత్ అందించాలని కోరుతున్నాం’’ అని స్థానిక ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 లోక్సభ సీట్లు వస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి భారత్లో విలీనం చేస్తామంటూ అసోం సీఎం హిమంత బిస్వ శర్మ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన బీజేపీ మాత్రమే.. పీఓకేను దేశంలో విలీనం చేయగలదని ఆయన చెప్పారు. పాకిస్తాన్లోకి చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసే నిర్ణయాన్ని కేవలం ఎన్డీయే సర్కారు మాత్రమే తీసుకోగలిగిందని సీఎం హిమంత గుర్తుచేశారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![POK : పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు విరమించనున్నారా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/POK.jpg)
POK : పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు విరమించనున్నారా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో మరణించిన తమ కార్మికుల్లో ఒకరికి అంత్యక్రియలు నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్ పీపుల్ యాక్షన్ కమిటీ (జెఎఎసి) తన నిరసనను విరమించనుంది.