4 Terrorists Killed: నలుగురు ఉగ్రవాదులు హతం.. వారం వ్యవధిలో 9 మంది టెర్రరిస్టులు హతం
కుప్వారాలో చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ నలుగురు ఉగ్రవాదులు (4 Terrorists Killed) హతమయ్యారు.
- By Gopichand Published Date - 11:48 AM, Fri - 23 June 23
4 Terrorists Killed: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కుప్వారాలో చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ నలుగురు ఉగ్రవాదులు (4 Terrorists Killed) హతమయ్యారు. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం కాశ్మీర్లో భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. దీంతో వారం వ్యవధిలో ఇప్పటి వరకు 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
నిజానికి ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా కశ్మీర్ పర్యటనకు వెళ్తున్న తరుణంలో కాశ్మీర్ భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఈ చర్య తీసుకున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. నగరంలోని భగవతి నగర్లో జరిగే బహిరంగ సభలో షా ప్రసంగించనున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారు.
అంతకుముందు, జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గురువారం పోలీసులు తుప్పుపట్టిన హ్యాండ్ గ్రెనేడ్ను స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బషోలీలోని బసంత్పురా అటవీ ప్రాంతంలో ఈ రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హ్యాండ్ గ్రెనేడ్ను నిర్వీర్యం చేశారని తెలిపారు.
Also Read: Bharat Mata Ki Jai: అమెరికాలో ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలు.. వీడియో..!
ఉగ్రవాది సహచరుడి ఇల్లు అటాచ్
నిన్న తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు విభాగం (SIU) అనంతనాగ్ జిల్లాలో లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాది సహచరుడి ఇంటిని అటాచ్ చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి లాజిస్టిక్ మద్దతు అందించడం వంటి కేసులపై అణిచివేత కొనసాగిస్తూ సుభాన్పురా బిజ్బెహరా ప్రాంతంలోని ఒక ఉగ్రవాది సహచరుడి ఇంటిని SIU అటాచ్ చేసిందని పోలీసు ప్రతినిధి తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ నెం. 22/2022 ఆధారంగా దర్యాప్తులో ఉగ్రవాది సహచరుడు జుబేర్ అహ్మద్ గనీ తండ్రి అబ్దుల్ రెహమాన్ గనీ ఇంటిని ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు తేలిందని ఆయన చెప్పారు.
Related News
Pakistan : పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
Farooq Abdullah: పీవోకే(PoK)ను భారత్(India)లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి చెబితే ముందుకు వెళ్లండి.. ఆపడానికి మనమెవరు? కానీ గుర్తుంచుకోండి, వారు (పాకిస్థాన్) గాజులు తొడుక్కుని లేదని, ఆదేశం వద్ద అణు బాంబులు ఉన్నాయిని, పాక్ ప్రతీ�