4 killed In Fire: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఊపిరాడక నలుగురు మృతి
ఢిల్లీలోని షహ్దారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మొత్తం నలుగురు (4 killed In Fire) మరణించారు.
- By Gopichand Published Date - 11:50 AM, Thu - 14 March 24
4 killed In Fire: ఢిల్లీలోని షహ్దారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మొత్తం నలుగురు (4 killed In Fire) మరణించారు. గురువారం తెల్లవారుజామున శాస్త్రి నగర్లోని నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఇద్దరు బాలికలు, దంపతులు ఊపిరాడక మృతి చెందారు. మంటలు చెలరేగిన భవనానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతా కాలి బూడిదైనట్లు ఈ వీడియోలో చూడవచ్చు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మృతులను మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), ఐదు, మూడెళ్ల వయసున్న ఇద్దరు బాలికలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు బాలికలు, ఒక జంట ఊపిరాడక చనిపోయారని ఆసుపత్రి నుండి మాకు సమాచారం అందిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గీతా కాలనీ సమీపంలోని శాస్త్రి నగర్లో తెల్లవారుజామున 5.20 గంటలకు భారీ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిందని, వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్కు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
Also Read: Pre-Pregnancy Tests: ప్రెగ్నెన్సీకి ముందు మహిళలు ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే..!
Watch: Four people, including two children, died while five others were rescued after a massive fire broke out at a four-storey residential building in Delhi’s Shastri Nagar area in the early morning. pic.twitter.com/y52bVdNaVL
— IANS (@ians_india) March 14, 2024
ఈ భవనంలో నాలుగు అంతస్తులు ఉన్నాయి
స్థానిక పోలీసుల బృందం, నాలుగు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్, పిసిఆర్ వ్యాన్లను సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారి తెలిపారు. మంటలు చెలరేగిన భవనంలో నాలుగు అంతస్తులు ఉన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఉందని పోలీసులు తెలిపారు. పార్కింగ్ స్థలంలోనే మంటలు చెలరేగాయని, క్రమంగా మంటలు భవనం మొత్తం వ్యాపించాయని చెప్పారు.
పార్కింగ్ స్థలం నుంచి మంటలు చెలరేగడంతో భవనమంతా పొగ వ్యాపించిందని తెలిపారు. “వీధి ఇరుకైనప్పటికీ అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రతి అంతస్తులో శోధించారు. ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలను అక్కడి నుండి ఖాళీ చేసి హెడ్గేవార్ ఆసుపత్రికి పంపారు” అని అధికారి తెలిపారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
Robotic Kidney Transplant: రోబోతో కిడ్నీ మార్పిడి.. అసలు రోబోటిక్ కిడ్నీ మార్పిడి అంటే ఏమిటి..?
ఇటీవల ఆర్మీ హాస్పిటల్ RRలో విజయవంతమైన రోబోటిక్ కిడ్నీ మార్పిడి జరిగింది. 179 మెడ్ రెజిమెంట్కు చెందిన హవల్దార్ భోజ్రాజ్ సింగ్ భార్య అనిత (33 సంవత్సరాలు) విజయవంతంగా రోబోటిక్ కిడ్నీ మార్పిడి చేయించుకుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.