Farmers: ఆ రైతులకు ‘రైతుబంధు’ కట్
గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 10:23 PM, Wed - 16 March 22
గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్, ఉన్నతాధికారులు దాడులు చేస్తున్నారు. అయితే చాలాచోట్ల గంజాయి సాగు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంజాయి సాగుచేస్తున్న రైతులను రైతుబంధు పథకానికి అనర్హులుగా ప్రకటించింది వ్యవసాయ శాఖ.
రాష్ట్రంలోని అన్ని ఎక్సైజ్ స్టేషన్ల నుంచి సంబంధిత సమాచారాన్ని సేకరించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 109 మంది రైతుల జాబితాను సిద్ధం చేసింది. పొలాల్లో దాడులు నిర్వహించి గంజాయి సాగుపై పక్కా సమాచారం రాబట్టి కేసులు నమోదు చేశారు. రైతులు తక్కువ పరిమాణంలో గంజాయిని పండించినప్పటికీ, నిబంధనల ప్రకారం మేం కేసులు నమోదు చేసాం” అని అధికారి తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలు, కొనుగోళ్లపై ఆ శాఖ సీరియస్గా వ్యవహరిస్తోందన్నారు.
Related News
Phone Tapping Case: కేటీఆర్కు పదేళ్లు జైలు శిక్ష: కోమటిరెడ్డి
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రుజువైతే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పదేళ్ల జైలు శిక్ష తప్పదని అన్నారు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ స్వయంగా అంగీకరించారు