మంగళగిరిలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరుతున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్
మంగళగిరిలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో
- By Prasad Published Date - 06:50 PM, Tue - 17 January 23
మంగళగిరిలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ సమక్షంలో కాండ్రు శ్రీనివాసరావు కండువా కప్పుకోనున్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ తనకు వైసీపీలో తగిన గుర్తింపు కానీ, సముచిత స్థానం కానీ లభించలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరుతున్న సందర్భంగా మంగళగిరిలో భారీగా ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగిస్తుండటంతో మున్సిపల్ అధికారులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల శైలిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.
Related News
Chandrababu : అమెరికాలో చంద్రబాబు.. ఆయన అడ్రస్ కోసం వెతుకుతున్న తెలుగువారు
ఉక్కపోతలో ఎన్నికల ప్రచార షెడ్యూల్లలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తి కావడంతో, అన్ని రాజకీయ నేతల నాయకులు తమ తీవ్రమైన షెడ్యూల్ల నుండి చాలా అవసరమైన విరామం తీసుకున్నారు.