Weather Updates: రేపటి వరకు భారీ వర్షాలు.. అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..!
రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.ఈ రోజు కూడా ఉష్ణోగ్రత తగ్గుదల కనిపిస్తుంది.
- By Gopichand Published Date - 09:32 AM, Thu - 1 August 24

Weather Updates: రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటలో 100 మి.లీ. వర్షం నమోదైంది. IMD ప్రకారం.. ఒక గంటలో ఇంత వర్షం పడితే దానిని క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఈరోజు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Updates) అంచనా వేస్తుంది. జూలైలో ఢిల్లీలో రెండు రోజులు మాత్రమే భారీ వర్షాలు కురిశాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. మొదటిది జూలై ప్రారంభంలో, రెండవది చివరిలో. ఈరోజు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం.
రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.ఈ రోజు కూడా ఉష్ణోగ్రత తగ్గుదల కనిపిస్తుంది. అంతకుముందు తేమతో ప్రజలు ఇబ్బంది పడేవారు. నేడు ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా ప్రజలు తేమ నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. మరో రెండు మూడు రోజుల పాటు రాజధానిలో ఇలాంటి వర్షాభావ పరిస్థితులు కొనసాగనున్నాయి. ఆగస్టు 3 తర్వాత రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో వర్షాకాలం తేలికగా మారుతుంది.
Also Read: Neeraj Chopra: నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే.. అందరికీ ఉచితంగా స్కెంజెన్ వీసా..!
యూపీలో 24 గంటల్లో 15 మంది చనిపోయారు
మరోవైపు యూపీలో వర్షం కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. రాజధాని లక్నోలో భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా యూపీలో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 15 మంది మరణించారు. చందౌలీలో 4 మంది, బాందా, నోయిడాలో ముగ్గురు చొప్పున.. ప్రయాగ్రాజ్లో ఇద్దరు, ప్రతాప్గఢ్, గోండా, ఇటావాలో ఒక్కొక్కరు మరణించారు. బదౌన్లోని కచ్లా వంతెన వద్ద గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో వరదలు వంటి పరిస్థితులు ఉన్నాయి. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
వాతావరణ శాఖ ఈరోజు ఢిల్లీ-ఎన్సీఆర్కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఒడిశాలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హర్యానా, చండీగఢ్, యూపీ, రాజస్థాన్, బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో ఆగస్టు 2 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.