Landslide: కేరళలో విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి..?
వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
- By Gopichand Published Date - 09:31 AM, Tue - 30 July 24

Landslide: భారీ వర్షాల తర్వాత కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి (Landslide) వందలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం మంగళవారం (జూలై 30) తెల్లవారుజామున వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండక్కై టౌన్, చురల్ మాలలో జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో 12 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే, ఒక చిన్నారి సహా నలుగురు మృతి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది.
కొండచరియలు విరిగిపడటంతో గాయపడిన 50 మందిని ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షాల సమయంలో తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ముండక్కై పట్టణంలో మొదటి కొండచరియలు విరిగిపడ్డాయి. ముండక్కైలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు చురల్ మాలలోని పాఠశాల సమీపంలో రెండవసారి కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో క్యాంపుగా నడుస్తున్న పాఠశాల, సమీపంలోని ఇళ్లు, దుకాణాలు నీరు, బురదతో నిండిపోయాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read: ITR Filing Deadline: రేపే లాస్ట్.. లేదంటే రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే..!
అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్లు విడుదల
అత్యవసర సాయం కోసం హెల్ప్లైన్ నంబర్లు జారీ చేశామని, రెస్క్యూ ఆపరేషన్లో వైమానిక దళాన్ని మోహరించినట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తెలిపింది. “భారీ వర్షాల తర్వాత వాయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆరోగ్య శాఖ- జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ను తెరిచింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్లు 9656938689, 8086010833 జారీ చేశారు. ఎయిర్ ఫోర్స్ Mi-17 రెండు హెలికాప్టర్లు, ఒక ALH బయలుదేరాయని సీఎంవో కార్యాలయం తెలిపింది.
Landslide visuals are coming in from #Wayanad #keralarains pic.twitter.com/a5Y9APcvst
— MasRainman (@MasRainman) July 30, 2024
నేపాలీ కుటుంబానికి చెందిన 1 ఏళ్ల చిన్నారి మరణం
తొండర్నాడ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో నేపాలీ కుటుంబానికి చెందిన చిన్నారి మృతి చెందినట్లు వయనాడ్ జిల్లా యంత్రాంగం తెలిపింది. చిన్నారికి ఒక సంవత్సరం మాత్రమే. చురల్మలలో ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నివేదికల ప్రకారం.. చాలా మంది ప్రజలు నిద్రిస్తున్న సమయంలో రాత్రి 2 గంటలకు మొదటి ల్యాండ్ స్లైడ్ సంఘటన జరిగింది. విమ్స్ మెడికల్ కాలేజీ ఇచ్చిన సమాచారంలో 48 మంది చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 4 మంది మృతదేహాలు ఆసుపత్రికి చేరుకున్నాయని చెప్పారు. వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం అందజేస్తామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.