Bangalore : బెంగూళూరులో దారుణం.. తిండిపెట్టలేక రెండేళ్ల కుమార్తెను…?
కూతురికి భోజనం పెట్టేందుకు డబ్బులు లేవని ఓ వ్యక్తి తన రెండేళ్ల కూతురిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.కూతుర్ని..
- By Prasad Published Date - 10:56 AM, Mon - 28 November 22
కూతురికి భోజనం పెట్టేందుకు డబ్బులు లేవని ఓ వ్యక్తి తన రెండేళ్ల కూతురిని హత్య చేశాడు. కూతుర్ని చంపిన తరువాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే.. కోలార్ తాలూకా కెందట్టి గ్రామంలోని సరస్సులో రెండేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. సరస్సు ఒడ్డున ఓ కారుని స్థానికులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు కోలారు రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని గుజరాత్కు చెందిన రాహుల్ పర్మార్గా గుర్తించారు . రెండేళ్ల క్రితం తన భార్య భవ్యతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు.
తన వద్ద డబ్బులు లేకపోవడంతో కూతురిని పోషించలేక రాహుల్ ఈ ఘాతుకానికి ఒడికట్టినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 15న నిందితుడు.. అతని కూతురు కనిపించకుండా పోయారని చిన్నారి తల్లి భవ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్మార్ గత 6 నెలలుగా నిరుద్యోగిగా ఉన్నాడు. నిందితుడు బిట్కాయిన్ వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయాడు. పర్మార్ తన ఇంట్లో బంగారు నగలు చోరీకి గురైనట్లు బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయగా.. ఇంట్లోని నగలను రాహుల్ తానే చోరీ చేసి తాకట్టు పెట్టినట్లు తెలిసింది. దీంతో పోలీసులు నకిలీ చోరీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Related News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు ?
Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.