Rohini-Roopa Transferred: ముదిరిన ‘కర్ణాటక’ పంచాయితీ.. రోహిణి, రూపలపై ప్రభుత్వం వేటు!
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి. రూప మౌద్గిల్లను (Rohini Vs Roopa) ట్రాన్స్ ఫర్ చేసింది.
- Author : Balu J
Date : 21-02-2023 - 5:39 IST
Published By : Hashtagu Telugu Desk
వారిద్దరూ సివిల్ సర్వెంట్స్ ఆఫీసర్.. ఉన్నత హోదాల్లో ఉన్న ఇద్దరు సోషల్ మీడియా (Social Media) వేదికగా పరస్పర అరోపణలు చేసుకున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద దుమారమే రేపింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మంగళవారం ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి. రూప మౌద్గిల్లను (Rohini Vs Roopa) ట్రాన్స్ ఫర్ చేసింది. డి రూప ఐఏఎస్ భర్త మునీష్ మౌద్గిల్ కూడా బదిలీ (Transfer) అయ్యారు.
అధికారులిద్దరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు పరస్పరం ఫిర్యాదులు, కౌంటర్లు చేసుకున్నారు. సోమవారం జరిగిన కేబినెట్ (Cabinet) సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అధికారుల ప్రజా పోరాటంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రూప నాపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, దీనిపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చానని, ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రూప ఐపీఎస్ అధికారిణి (Rohini Vs Roopa), ఆమె పని పరిధి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె వేరే సర్వీసుకు చెందినది, కానీ ఇప్పటికీ ఆమె నా వృత్తి జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది.
తన సొంత కారణాల వల్ల తాను సోషల్ మీడియాలో లేనని పేర్కొన్న ఆమె, అక్కడ వచ్చిన ఆరోపణలన్నింటికీ తాను స్పందించలేనని, అది కూడా వేదికగా భావించడం లేదని చెప్పింది. మైసూరులో కమిషనర్గా ఉన్న సమయంలో ఆ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో ఐపీఎస్ రూప ప్రశ్నలు సంధించింది. ఓ రాజకీయవేత్తతో ఐఏఎస్ రోహిణి సింధూరి ఎందుకు కలిసిందని, ఆ ఇద్దరి మధ్య ఏదో డీల్ కుదిరినట్లు రూప ఆరోపించింది. ఆ ఆరోపణలను సింధూరి కొట్టిపారేశారు. అయితే ధైర్యం, సమర్ధతకు పేరుగాంచిన ఇద్దరు (Rohini Vs Roopa) అధికారులకూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఇద్దరు అధికారుల అభిమానుల మధ్య కూడా గొడవ తీవ్రస్థాయిలో జరుగుతోంది.
Also Read: Padi Kaushik Reddy React: ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు: పాడి కౌశిక్ రెడ్డి