7 Killed : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగాం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వ బస్సును ఎదురుగా
- By Prasad Published Date - 04:06 PM, Tue - 24 October 23
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగాం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వ బస్సును ఎదురుగా వస్తున్న ఎస్యూవీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అస్సాంకు చెందిన ఐదుగురు కార్మికులతో సహా ఏడుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. దాదాపు 11 మంది కార్మికులతో కూడిన ఎస్యూవీ వాహనం కృష్ణగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్యూవీలో ప్రయాణిస్తున్న 11 మందిలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని తిరువణ్ణామలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను అస్సాంకు చెందిన భీన్మల్ తీర్థ్, కుంచ రాయ్, దల్లు, నికోలస్, నారాయణ్ సేథి, డ్రైవర్ పునీత్ కుమార్, కృష్ణగిరి జిల్లాకు చెందిన కామరాజ్లుగా గుర్తించారు. వీరంతా హోసూరు సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులు, ఆయుధ పూజ రోజున పుదుచ్చేరి సందర్శించి తిరిగి వస్తున్నారు. అయితే TNSTC బస్సులోని ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Related News
Salman Khan : సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు.. జైలులో నిందితుడి సూసైడ్
Salman Khan : బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం ఇటీవల కలకలం రేపింది.