Road Accident : ఐటీ కారిడార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు టెక్కీలు దుర్మరణం
చెన్నై ఐటీ కారిడార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా....
- By Prasad Published Date - 09:23 AM, Fri - 16 September 22
చెన్నై ఐటీ కారిడార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగినులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నిన్న రాత్రి 11.30గంటల సమయంలో ఆఫీస్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా చెన్నైలోని ఓఎంఆర్ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి టెకీలపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన మరో యువతి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచారు. మృతులు తిరుపతికి చెందిన ఎస్.లావణ్య (24), కేరళలోని పాలక్కడ్కు చెందిన ఆర్. శ్రీలక్ష్మీ (23)గా గుర్తించారు. వీరిద్దరూ హెచ్సీఎల్ స్టేట్ స్ట్రీట్ సర్వీస్లో ఎనలిస్ట్లుగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మోతేష్ కుమార్ (20)ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 130 కి.మీల వేగంతో ఉందని పోలీసులు వెల్లడించారు.
Related News
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. డబ్బులేక పోటీ చేయట్లేదు..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ప్రశ్నపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదని అన్నారు.