Kerala: ఫుట్బాల్ మ్యాచ్లో గ్యాలరీ కూలి.. 60 మందికి గాయాలు..!
- By HashtagU Desk Published Date - 10:36 AM, Sun - 20 March 22

కేరళలో విషాదం చోటు చేసుకుంది. కేరళలోని వాండోర్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫుట్బాల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఉండగా, గ్యాలరీవిరిగి పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 మందికి పైగా గాయాలపాలయ్యాయని సమాచారం. ఈ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వాండోర్, కలికావు సమీపంలో పూన్ గోడు అనే గ్రామంలో ఈ స్టేడియంను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారి గ్యాలరీ కూలిపోయింది. దీంతో ప్రేక్షకులంతా స్టేడియం బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. ఈ తొక్కిసలాటలో చాలామందితకి గాయాలయ్యాయి. స్థానికులే ఈ మ్యాచ్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. పూన్ గోడు గ్రామస్థులకు ఫుట్బాల్ అంటే పిచ్చి. స్థానికంగా ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి 9గంటలకు జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.