NEET 2024 Exam Update: నేడు నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఎగ్జామ్!
- By Gopichand Published Date - 11:33 AM, Sun - 23 June 24
![NEET 2024 Exam Update: నేడు నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఎగ్జామ్!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/05/NEET-exam-imresizer.jpg)
NEET 2024 Exam Update: నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఈరోజు అంటే జూన్ 23న మళ్లీ పరీక్ష (NEET 2024 Exam Update) నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల మధ్య జరగనుంది. NTA జూన్ 20వ తేదీన రీ-ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డ్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 30లోగా విడుదలవుతాయి. నీట్ యూజీ రివైజ్డ్ రిజల్ట్ వెలువడిన తర్వాత జూలై 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అంతకుముందు NEET-UG పరీక్షల వివాదం మధ్య కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి 9 గంటలకు NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ను తొలగించింది. కొత్త డీజీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు. మరోవైపు నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది కేంద్రం. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అర్థరాత్రి ప్రకటించింది.
We’re now on WhatsApp : Click to Join
6 నగరాల్లో పరీక్ష జరుగుతోంది
నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు వచ్చిన ఆరు నగరాల్లో నీట్ రీ-ఎగ్జామ్ జరుగుతోంది. ఈ 6 నగరాల్లో రీ-ఎగ్జామ్ ఉంది. కానీ పరీక్షా కేంద్రాలు మార్చబడ్డాయి. ఆ నగరాలివే
- బలోద్, ఛత్తీస్గఢ్
- దంతేవాడ, ఛత్తీస్గఢ్
- సూరత్, గుజరాత్
- మేఘాలయ, మేఘాలయ
- బహదూర్ఘర్, హర్యానా
- చండీగఢ్
హర్యానాలోని ఝజ్జర్ సెంటర్లో పరీక్ష జరగదు
720/720 స్కోరు సాధించిన ఆరుగురు అభ్యర్థులు హర్యానాలోని ఝజ్జర్ సెంటర్ నుండి హాజరయ్యారు. ఈ కేంద్రంలో పునఃపరీక్ష నిర్వహించటంలేదు. పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో మార్పులు చేసినట్లు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు తెలిపారు.
Also Read: MLC Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ అరెస్టు
విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఉంటారు
ఈ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఎన్టీఏ పరిశీలకులను నియమించింది. పరీక్ష సమయంలో NTA, విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద ఉంటారు.
నీట్ పీజీ పరీక్ష అర్థరాత్రి వాయిదా పడింది
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి 10 గంటలకు నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. ఈ రోజు జూన్ 23న పరీక్ష జరగాల్సి ఉంది. ముందుజాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తారు.
కొన్ని పోటీ పరీక్షలలో ఇటీవల జరిగిన అవకతవకల సంఘటనల దృష్ట్యా, నీట్-పీజీ ప్రవేశ పరీక్షకు సన్నాహాలు పటిష్టతను పరిశీలించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీని ప్రకారం ఈరోజు జూన్ 23, 2024న జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు.
శనివారం రాత్రి ఎన్టీఏ డీజీని తొలగించారు
ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ను శనివారం రాత్రి 9 గంటలకు కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త డీజీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు. ఖరోలా ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ CMD. 1 మే 2024న అతనికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఛైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్ష ఎప్పుడంటే..? ఎగ్జామినేషన్ చైర్మన్ ఏం చెప్పారంటే..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/NEET-Toppers.jpg)
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్ష ఎప్పుడంటే..? ఎగ్జామినేషన్ చైర్మన్ ఏం చెప్పారంటే..?
NEET PG 2024 Exam Date: నీట్ పీజీ పరీక్షకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. నీట్ పీజీ పరీక్ష తేదీ (NEET PG 2024 Exam Date)ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. కొత్త పరీక్ష తేదీని వచ్చే వారం ప్రకటించనున్నారు. వచ్చే వారం చివరిలోపు తేదీని ప్రకటిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) చైర్మన్ డాక్టర్ అభిజత్ సేథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికను వి�