First Private Train : దేశంలోనే తొలి ప్రైవేటు రైలు.. ఏ రూట్లలో నడుస్తుందో తెలుసా ?
First Private Train : మన దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులకు తొలి బీజం పడబోతోంది. ఎక్కడో తెలుసా ?
- By Pasha Published Date - 11:28 AM, Tue - 7 May 24
First Private Train : మన దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులకు తొలి బీజం పడబోతోంది. ఎక్కడో తెలుసా ? కేరళలో !! జూన్ 4న కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వైపుగా తొలి ప్రైవేట్ రైలు పరుగులు తీయనుంది. ఈ రూట్లో త్రివేండ్రం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ సహా పలు స్టేషన్లలో రైలు హాల్టింగ్స్ ఉన్నాయి. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రైవేటు ట్రైనును నడుపుతారు. కేంద్ర రైల్వే శాఖ, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఎస్ఆర్ఎంపీఆర్(SRMPR) గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రైవేటు రైలు సర్వీసును లీజుపై నిర్వహించనుంది. రైలును, దానిలోని సౌకర్యాలను ఎస్ఆర్ఎంపీఆర్ నిర్వహించనుండగా.. ఆ ట్రైనుకు సంబంధించిన టికెటింగ్, మార్కెటింగ్ బాధ్యతలను ప్రిన్సి ట్రావెల్స్ పర్యవేక్షించనుంది. తదుపరిగా ముంబై, అయోధ్య రూట్లోనూ ఈ ప్రైవేటు ట్రైన్ను నడపాలని ప్లాన్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- ఈ ప్రైవేటు ట్రైనులో(First Private Train) ఏకకాలంలో 750 మంది ప్రయాణించొచ్చు. ఇందులో 2 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు ఉన్నాయి.
- ఈ రైలులో వైద్య నిపుణులు సహా మొత్తం 60 మంది సిబ్బంది ఉంటారు.
- ఈ రైలులో భోజన వసతి, వైఫై కనెక్టివిటీ, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి.
- ఈ రైలులోని నాన్-ఏసీ స్లీపర్ బోగీలో గోవాకు 4 రోజుల పర్యటన కోసం రూ.13,999 టికెట్ ఛార్జీని వసూలు చేస్తారు. త్రీ టైర్ ఏసీ కోచ్లో టికెట్ ధర రూ.15,150, టూ టైర్ ఏసీ కోచ్లో సీటు ధర రూ.16,400.
Also Read :KCR Vs Modi : నా అరెస్టుకూ మోడీ కుట్ర.. కేసీఆర్ సంచలన ఆరోపణ
- ప్రైవేటు రైలు టికెట్ల రేట్లు ముంబై రూట్లో రూ.15,050(నాన్ ఏసీ స్లీపర్), రూ.16,920 (త్రీ టైర్ ఏసీ), రూ. 18,825 (టూ టైర్ ఏసీ) మేర ఉంటాయి.
- అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్లోని ప్రదేశాలను కవర్ చేస్తూ 8 రోజుల పాటు సాగే టూర్ ప్యాకేజీ రేట్లు వరుసగా రూ. 30,550 (స్లీపర్ నాన్ ఏసీ), రూ. 33,850 (త్రీ టైర్ ఏసీ), రూ.37,150 (టూ టైర్ ఏసీ) ఉంటాయి.
Also Read :RRR : రీ రిలీజ్కి సిద్దమైన ఆర్ఆర్ఆర్.. ఎప్పుడంటే..
Related News
Kerala: మహిళపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
కేరళలోని కన్నూర్లో మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగు చూసింది. ఈ కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు.