Karnataka : SC/ST రిజర్వేషన్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ..!!
అసెంబ్లీ ఎన్నికల ముందు కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
- By hashtagu Published Date - 06:44 AM, Sat - 8 October 22
అసెంబ్లీ ఎన్నికల ముందు కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎస్సీ కోటాను 15 శాతం నుంచి 17శాతానికి ఎస్టీలకు 3 శాతం నుంచి 7శాతానికి పెంచాలని నిర్ణయించింది. జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ నివేదికపై చర్చించేందుకు ఉభయ సభల నేతల సమావేశానికి సీఎం బసవరాజ్ బొమ్మై అధ్యక్షత వహించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ కోటా పెంపుదల చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ అని తెలిపారు.
కాగా ఈ సమావేశంలో ఎస్సీలకు 17శాతానికి, ఎస్టీలకు 7శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశానికి ముందుగా అఖిలపక్ష సమావేశంలో సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. సామాజిక న్యాయం పట్ల తమ నిబద్ధతను చాటుకునేందుకు ఈ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ రిపోర్టులోని అన్ని సిఫార్సులపై చర్చించేందుకు శనివారం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీల మధ్య అంతర్గత రిజర్వేషన్లకు సంబంధించి నిర్ణయాలు కూడా నిపుణులు, అన్ని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపి నిర్ణక్ష్ం తీసుకుంటామని తెలిపారు.
Related News
Prajwal Revanna : ప్రజ్వల్పై చర్యకు అభ్యంతరం లేదు.. తన మనవడి కేసుపై తొలిసారి స్పందించిన దేవెగౌడ
తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియో కుంభకోణంపై మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ తొలిసారి స్పందించారు.