Amit Shah: అమిత్ షా మహారాష్ట్ర పర్యటన రద్దు.. హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకు?
మణిపూర్ హింసాకాండ కారణంగా షా తన ఎన్నికల పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం.
- By Gopichand Published Date - 04:34 PM, Sun - 17 November 24

Amit Shah: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నవంబర్ 18 సోమవారం చివరి రోజు. కాగా బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం రాష్ట్రంలో 4 ర్యాలీలు నిర్వహించాల్సి ఉండగా, తన ఎన్నికల కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని లేని సమయంలో దేశాన్ని మేనేజ్ చేస్తున్న అమిత్ షా హఠాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
ఇప్పుడు మణిపూర్ హింసాకాండ కారణంగా షా తన ఎన్నికల పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం. ఇక్కడికి చేరుకోగానే సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ని రాజధాని ఇంఫాల్కు పంపి మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కోరారు. మణిపూర్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఉన్నతాధికారుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు.
Also Read: Nara Ramamurthy Naidu Funerals : అధికార లాంఛనాలతో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తి
స్మృతి ఇరానీ ప్రసంగిస్తారు
ఈ రోజు అమిత్ షా గడ్చిరోలి, వార్ధా, కటోల్, సేవర్లలో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నట్లు తొలుత బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సమావేశాల్లో షా స్థానంలో స్మృతి ఇరానీ ప్రసంగించాలని పార్టీ నిర్ణయించింది. మణిపూర్లో పరిస్థితి చూస్తుంటే అక్కడ ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయి. మణిపూర్లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలించారు. అయితే మళ్లీ కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మణిపూర్లో హింస ఎందుకు చెలరేగింది?
2023 జూలై నుంచి మణిపూర్లో జాతి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్రం మొత్తం పరిస్థితి బాగానే ఉన్నా, అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శనివారం రాత్రి ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు అక్రమార్కులు నిప్పు పెట్టారు. అలజడి సృష్టించిన వారంతా కుకీ, జో వర్గానికి చెందిన వారేనని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జిరిబామ్ జిల్లాలోని CRPF క్యాంపుపై కుకీ వర్గాలు దాడి చేశాయి. అయితే భద్రతా దళాలు అప్రమత్తమై వారిని హతమార్చారు. అప్పటి నుంచి రాష్ట్రంలో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంది. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.