Lakhpati Sweeper: కరోడ్పతి స్వీపర్.. ట్రీట్మెంట్ కోసం కూడా శాలరీ డబ్బులు ముట్టుకోకుండా చనిపోయాడు!!
బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.70 లక్షలున్నా.. కడు పేదవాడిలా బతికాడు.చివరకు మంచి ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా టీబీతో బాధపడుతూ చనిపోయాడు.
- By Hashtag U Published Date - 05:45 AM, Wed - 7 September 22
బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.70 లక్షలున్నా.. కడు పేదవాడిలా బతికాడు.చివరకు మంచి ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా టీబీతో బాధపడుతూ చనిపోయాడు.ట్రీట్మెంట్ కోసం బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.ఈ వింత గాధ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు చెందిన ధీరజ్ అనే వ్యక్తికి సంబంధించినది.
కరోడ్పతి స్వీపర్..
ధీరజ్ తండ్రి ప్రయాగ్రాజ్ జిల్లా కుష్ఠువ్యాధి విభాగంలో స్వీపర్గా పనిచేసేవారు. ఆయన తర్వాత ఆ ఉద్యోగం ధీరజ్ కు వచ్చింది. స్వీపర్గా పనిచేసిన ధీరజ్ని అందరూ కరోడ్పతి స్వీపర్ అని పిలిచేవారు. ఎందుకంటే ధీరజ్ ప్రతినెలా తన జీతం మొత్తాన్ని సేవ్ చేసేవాడు. బ్యాంకులో డబ్బు వేస్తే ఒక్కపైసా కూడా తీసేవాడు కాదు. ధీరజ్ తన తండ్రి అడుగుజాడల్లో నడిచేవాడని, తండ్రి కూడా బ్యాంకు నుంచి పైసా కూడా విత్డ్రా చేసేవాడుకాదని స్థానికులు తెలిపారు.
అప్పులు చేస్తూ..
తండ్రి మాదిరిగానే బంధువులు, సన్నిహితులు, సహచరుల నుంచి ధీరజ్ అప్పులు చేసేవాడని, ఒకరకంగా చెప్పాలంటే అడుక్కునేవాడని తెలిపారు.టీబీ (ట్యూబర్ కులోసిస్)తో బాధపడుతూ విషాదకర రీతిలో ధీరజ్ చనిపోయాడు.ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎంతసంపాదిస్తే ఏం లాభం?.. కూడబెట్టింది ఉపయోగించు కోకుంటే ఏం ప్రయోజనం?.. బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.70 లక్షల సొమ్ము పెట్టుకుని టీబీతో చనిపోయాడు.
హాస్పిటల్ ఆవరణలోనే తన తల్లి, సోదరితో అతడు నివసించాడని పేర్కొన్నారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదని ధీరజ్ ను అడిగితే.. భార్య తన డబ్బంతా తీసుకుని ఎక్కడ పారిపోతుందో ఏమోననే భయంతో పెళ్లి చేసుకోలేదని చెప్పేవాడని స్థానికులు పేర్కొన్నారు. అయితే తాను తీసుకున్న అప్పు చెల్లించాడా?లేదా? అనేది తెలియరాలేదు. ఒకవేళ అప్పులు తీర్చి ఉంటే ఎలా తీర్చాడనేది పెద్ద ప్రశ్న అని చెబుతున్నారు. అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ప్రభుత్వానికి ధీరజ్ క్రమం తప్పకుండా పన్నులు చెల్లించేవాడట.
Related News
Maggi Noodles : నూడుల్స్ తిని బాలుడు మృతి.. కారణం తెలిస్తే షాక్..!
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందాడు.