Bank Robbery : మణప్పురం బ్యాంకులో భారీ దోపిడి…సిబ్బందిని కొట్టి 16కిలోల బంగారం లూటీ.!!
- By hashtagu Published Date - 11:38 AM, Sun - 27 November 22
మధ్యప్రదేశ్ లోని కత్తిని రంగానాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో భారీ దోపిడి జరిగింది. పట్టపగలు ఆరుగురు దుండగులు బ్యాంకులో ఉన్న సిబ్బందిని తీవ్రంగా కొట్టి 16కిలోల బంగారం, 3.5లక్షల కు పైగా నగదుతో ఉడాయించారు. ముఖానికి మాస్క్ లతోపాటు హెల్మెట్లు ధరించిన దుండగులు బ్యాంకులో వచ్చిన దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. గన్స్ చూపిస్తూ బ్యాంకులో ఉన్న నగదు, బంగారం దోచుకున్నారు. బంగారం, నగదును దోచుకున్న దుండగులు బ్రాంచ్ మేనేజర్ కారులో పరారయ్యారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు సిబ్బంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయం 10:30గంటల ప్రాంతంలో ఈఘటన జరిగినట్లు తెలిపారు. దుండగుల దాడిలో బ్యాంకు సిబ్బంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
Related News
Borewell : బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రేవా జిల్లా(Rewa District)లో ఆరేండ్ల బాలుడు(6 year old boy) బోరు బావిBorewell)లో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రేవా జిల్లా మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు ఓపెన్ బోర్వెల్ దగ్గర ఆడుకుంటుండగా హఠాత్తుగా దాంట్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధ�