Bank Robbery : మణప్పురం బ్యాంకులో భారీ దోపిడి…సిబ్బందిని కొట్టి 16కిలోల బంగారం లూటీ.!!

  • Written By:
  • Updated On - November 27, 2022 / 11:51 AM IST

మధ్యప్రదేశ్ లోని కత్తిని రంగానాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో భారీ దోపిడి జరిగింది. పట్టపగలు ఆరుగురు దుండగులు బ్యాంకులో ఉన్న సిబ్బందిని తీవ్రంగా కొట్టి 16కిలోల బంగారం, 3.5లక్షల కు పైగా నగదుతో ఉడాయించారు. ముఖానికి మాస్క్ లతోపాటు హెల్మెట్లు ధరించిన దుండగులు  బ్యాంకులో వచ్చిన దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. గన్స్ చూపిస్తూ బ్యాంకులో ఉన్న  నగదు, బంగారం దోచుకున్నారు. బంగారం, నగదును దోచుకున్న దుండగులు  బ్రాంచ్ మేనేజర్ కారులో పరారయ్యారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు సిబ్బంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. శనివారం ఉదయం 10:30గంటల ప్రాంతంలో ఈఘటన జరిగినట్లు తెలిపారు. దుండగుల దాడిలో బ్యాంకు సిబ్బంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.