Army Soldiers: ఆర్మీ జవాన్ల మానవత్వం.. గర్భిణిని 14 కిలోమీటర్లు మోసి, ఆస్పత్రికి తరలించి!
ఆర్మీ జవాన్లు (Army Soldiers) మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు.
- By Balu J Published Date - 11:23 AM, Tue - 17 January 23
జమ్మూ-కశ్మీర్లో ఆర్మీ జవాన్లు (Army Soldiers) మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని 14 కి.మీ.మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. ఖారీ ప్రాంతంలోని హర్గం అనే గ్రామంలో ఓ కుటుంబం, ఆ గ్రామ సర్పంచ్ నుంచి ఆర్మీకి (Army Soldiers) మెడికల్ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇచ్చారు.
మంచుతో రోడ్లు జారుడుగా ఉన్నాయి. దీంతో జవాన్లు (Army Soldiers) దాదాపు 6 అడుగులు ఉన్న మంచులో 6 గంటల పాటు శ్రమించి మహిళను 14 కి.మీ.స్ట్రెచర్పై మోసుకెళ్లారు. అంగారీ అనే గ్రామంలో మరో ఆర్మీ బృందం అంబులెన్స్ను (Ambulance) సిద్ధంగా ఉంచింది. దీంతో గర్భిణిని సురక్షితంగా బనిలాల్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి బంధువులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Related News
BRS Party: కార్యకర్తల అక్రమ కేసుల పై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
BRS Party: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాల్నిప్రోత్సహిస్తోందని ఘాటుగా స్పందించింది. ‘‘ ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోంది. ముఖ్యంగా ప్ర�