Flight Delayed Over Chat: ప్రేమికులు చేసిన పనికి ఏకంగా 6 ఆగిపోయిన విమానం.. కాని చివరికి అలా?
ఇద్దరు ప్రేమికులు చేసిన పనికి ఏకంగా విమానం 6 గంటల పాటు ఆగిపోయింది. ప్రేమికులకు, విమానం ఆగిపోవడానికి
- By Nakshatra Published Date - 08:30 AM, Tue - 16 August 22
ఇద్దరు ప్రేమికులు చేసిన పనికి ఏకంగా విమానం 6 గంటల పాటు ఆగిపోయింది. ప్రేమికులకు, విమానం ఆగిపోవడానికి సంబంధం ఏముంది అనుకుంటున్నారా! పూర్తి వివరాలు లోకి వెళితే.. ఒక వ్యక్తి తన తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అప్పుడు అబ్బాయి ముంబై అమ్మాయి బెంగళూరుకు వెళ్లడానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఇక ముంబై వెళ్లే విమానం రావడంతో అబ్బాయి వెళ్లి విమానంలో కూర్చున్నాడు. మరోవైపు అమ్మాయి తన బెంగుళూరు విమానం కోసం ఎదురుచూస్తోంది.
ఆ సమయంలో ఆ ఇద్దరు ప్రేమికులు బోర్ కొడుతుంది అనుకున్నారేమో తెలియదు కానీ మొబైల్ లో చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే విమానాల్లో భద్రత గురించి సరదాగా మాట్లాడుకుంటూ నువ్వు ఒక బాంబర్ అంటూ ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ను కాస్త ఆ అబ్బాయి వెనుక సీటు ఉన్న అమ్మాయి చదివింది. వెంటనే భయాందోళనకు గురైన ఆ ప్రయాణికురాలు విమాన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ను ప్రభుత్వం చేశారు. అప్పుడు టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఆగిపోయింది. విమానాశ్రయ సిబ్బంది వెంటనే ప్రయాణికులు అందరిని కిందకు దించి వెంటనే విస్తృతంగా తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా ఇటువంటి వస్తువులు కనిపించకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత పోలీసులు కొన్ని గంటలపాటు ఆ ప్రముఖులు ఇద్దరినీ విచారించారు. అప్పుడు వారు కేవలం సరదా కోసమే చాలా సంభాషణ చేసాము అని తేలడంతో విమానాన్ని టేకాఫ్ అయ్యేందుకు అనుమతిని ఇచ్చారు. అలా దాదాపు ఆరు గంటల తరువాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అవమానం ముంబైకి బయలుదేరింది. పోలీసులు విచారించిన తర్వాత ఆ అబ్బాయిని కూడా విమానం ఎక్కడానికి అనుమతినిచ్చారు. కానీ ఆ అమ్మాయి మాత్రం విమానం మిస్ అవ్వాల్సి వచ్చింది. అయితే అది ఫ్రెండ్లీ చాటింగ్ కావడంతో ఎవరు ఫిర్యాదు చేయలేదని దీంతో ఎటువంటి కేసు నమోదు కాలేదు అని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ ఆ ప్రేమికులు చేసుకున్న ఫన్నీ చాటింగ్ వల్ల ఏకంగా విమాన సిబ్బందికి అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా తోటి ప్రయాణికులకు కూడా ఎంతో ఇబ్బంది అని కలిగింది.
Related News
Viral video: ఓటు వేసేందుకు వచ్చిన మహిళ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఏం జరిగిందంటే!
Viral video: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాభై ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం బెంగళూరు జేపీ నగర్ 8వ ఫేజ్ లోని జంబో సవారి దిన్నెలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. ఓటు కోసం పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చుంది. ఓటర్ల క్యూ దగ్గర ఉంచిన నీళ్లు తీసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అకస్మాత్తుగా ఆమెకు మైకం రావడంతో ఒక్కసారిగా పడిపోయింది. కాని డాక్టర్ అలర్ట్ అయి వెంటనే గుర్�