UP : ఉన్నావ్ లో దారుణం. దళిత బాలికపై అత్యాచారం, హత్య..!!
- By hashtagu Published Date - 10:19 PM, Sun - 13 November 22
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో దారుణం జరిగింది. దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు …బాలిక ఇంటికి వెళ్లాడు. వారిద్దరికి అప్పటికే పరిచయం ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు అత్యాచారానికి పాల్పడిన సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. అది గమనించిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అధికరక్తస్రావంతో బాలిక మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే పోలీసులు బాలిక మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులకు సులువుగా మారింది. వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడింది రాజ్ గౌతమ్ అని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శక్తివంతమైన మందులను అధికమోతాదులో తీసుకుని బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తీవ్రరక్తస్రావం కావడంతో బాలిక మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితునిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Related News
Uttar Pradesh: అత్యాధునిక ఆయుధాల కొనుగోలకు సీఎం యోగి నిధులు మంజూరు
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (UPSSF)కి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు సిద్ధమైంది.