ఆరోగ్యానికి ‘సిరి’ ధాన్యాలు.. బెనిఫిట్స్ ఇవే..!
ఇప్పుడు చాలామంది సిరిధాన్యాల పేరు వింటున్నారు. అయితే వాటితో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలియక సతమతమవుతున్నారు.
- By Hashtag U Published Date - 08:30 AM, Sun - 26 December 21
ఇప్పుడు చాలామంది సిరిధాన్యాల పేరు వింటున్నారు. అయితే వాటితో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలియక సతమతమవుతున్నారు.
మామూలుగా వరి, గోధుమ ధాన్యపు పై పొరలలోనే ఉండటంతో పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయి.
కొర్ర బియ్యం
కొర్ర బియ్యంను సమతుల్యమైన ఆహారంగా చెబుతారు.. 8 శాతం పీచుపదార్థంతో పాటు 12 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. గర్భిణీలకూ ఇవి మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగెట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్చలు వస్తాయి. తర్వాత అవే జీవితకాలం ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారికి కొర్రబియ్యం ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్, పార్కిన్సన్ రోగం, ఆస్తమా నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడతాయి.
అరికలు బియ్యం
రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి అధికంగా చక్కెర వ్యాధితో బాధపడుతున్నవారికి అరికెలు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి వీక్ నెస్ ను తగ్గిస్తాయి.
సామ బియ్యం
ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవడానికి.. మగ వారిలో వీర్యకణాల సంఖ్య పెరగడానికి సామ బియ్యం బాగా ఉపయోగపడతాయి. ఇవికాక మనిషి లింపు నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఊద బియ్యం
థైరాయిడ్, క్లోమ, గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి దానితో పాటు..కామెర్లు వచ్చి తగ్గక కూడా కాలేయానికి పుష్టి చేకూర్చడంలో ఊదబియ్యం హెల్ప్ చేస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం పనికి వస్తాయి.
అండుకొర్ర బియ్యం
మొలలు, అల్సర్లు, మెదడు, రక్తం, ఉదర,ప్రేగుల,చర్మ సంబంధ క్యాన్సర్ల చికిత్సకు అండుకొర్ర బియ్యం బాగా ఉపయోగపడుతాయి. శరీరానికి కావలసిన పీచు పదార్ధాలు ఎక్కువగా సిరి ధాన్యాలలో ఉంటాయి. సిరిధాన్యాలు 5 నుంచి 7 గంటల పాటు కొద్దీ కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్ ను రక్తంలోకి పంపిస్తాయి.
Related News
Health: జీడిపప్పు తినడం వల్ల మగవాళ్లకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా.. అవేంటో తెలుసా
Health: పురుషులు జీడిపప్పు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల పురుషులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది .టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్�