Vegetarians : శాకాహారులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి మాంసాహార బియ్యం
- By Sudheer Published Date - 12:15 PM, Sat - 17 February 24
ప్రస్తుతం జంతు ప్రేమికులు ఎక్కువైపోతున్నారు. జంతువులను చంపకూడదని ..వాటి మాంసం తినకూడదని ఏకంగా నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో వారిలో ప్రోటీన్ లోపం ఎక్కువై అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు. మరికొంతమంది పూర్తిగా మొదటి నుండి శాకాహారులగా ఉండడం వల్ల వారు కూడా ప్రోటీన్ లోపం తో బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం మార్కెట్ లోకి మాంసాహార బియ్యం అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు, మాంసంతో కూడిన కొత్త రకం బియ్యాన్ని (Meat-rice) అభివృద్ధి చేశారు. దీన్ని మీట్ రైస్, హైబ్రిడ్ రైస్ అంటున్నారు.
ఈ హైబ్రిడ్ బియ్యంలో మాంసకృత్తులు (Protein) పుష్కలంగా ఉంటాయి. దీనిని భూమి, వాతావరణం, నీరు, కూలీలపై ఆధారపడకుండా ఏ సీజన్లోనైనా పండించవచ్చు. జంతువులను చంపకుండానే ఈ బియ్యం ఉడికించుకొని మాంసంగా తినొచ్చని , దీనివల్ల ప్రోటీన్లు పొందొచ్చు అని చెపుతున్నారు. బియ్యం గింజల్లో జంతువుల కండరాలు, కొవ్వు కణాలను పెంచే ప్రయత్నాలు శాస్త్రవేత్తలు చేస్తున్నారు. తద్వారా “కల్చర్డ్ బీఫ్ రైస్”ను అభివృద్ధి చేయడానికి ప్రయోగాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
శాస్త్రవేత్త సోహియోన్ పార్క్, ఆమె బృందం హన్వూ (Hanwoo) అనే స్థానిక జాతి పశువుల నుంచి కండరాలు, కొవ్వు కణాలను సేకరించి, దాన్ని బియ్యం గింజల్లో ప్రవేశపెట్టారు. దీంతో బియ్యం ఉపరితలంపై మాంసం కణాలు పెరిగాయి. 11 రోజుల పాటు పెట్రీ డిష్లో బియ్యాన్ని కల్టివేట్/సాగు (Culture) చేయగా, మాంసం కణాలు బియ్యం చుట్టూ పలుచని పొరను ఏర్పరిచాయి. ఆ మీట్-రైస్ను పరీక్షించగా.. అది సాధారణ బియ్యం కంటే గట్టిగా, పెళుసుగా ఉందని కనుగొన్నారు. ఇందులో ఎక్కువ ప్రోటీన్, కొవ్వు ఉంటుందని తెలుసుకున్నారు. మాటర్ జర్నల్లో ప్రచురించిన వారి అధ్యయనం ప్రకారం, మీట్ రైస్లో సాధారణ బియ్యం కంటే 8% ఎక్కువ ప్రోటీన్, 7% ఎక్కువ కొవ్వు ఉందని వెల్లడించారు.
ఈ మీట్ రైస్, ఆహార ఉత్పత్తి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జంతువుల నుంచి 100 గ్రాముల మాంసం ప్రోటీన్ను ఉత్పత్తి చేయడం వల్ల దాదాపు 50 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని లెక్కించారు, అయితే మీట్ రైస్ నుంచి అదే మొత్తంలో ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తే 6.27 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ మాత్రమే విడుదల అవుతుందని చెపుతున్నారు. మీట్ రైస్ చౌకగా ఉంటుందని, కిలోగ్రాముకు సుమారు 2.23 డాలర్లు (కిలోగ్రాముకు రూ.185) ఖర్చవుతుందని వారు వెల్లడించారు.
Read Also : Raghuramakrishna: జగన్ సింహం కాదు…చిట్టెలుకే అంటూన్న వైసీపీ ఎంపీ
Related News
Apple iPhones Ban: ఈ దేశంలో ఐఫోన్లపై నిషేధం.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దక్షిణ కొరియా నుంచి ఆపిల్ కు చేదు వార్త వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా దక్షిణ కొరియా సైనిక భవనాల్లోకి ఐఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించింది.