Beetroot Mysore pak: బీట్రూట్తో మైసూర్ పాక్ ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు?
- By Sailaja Reddy Published Date - 03:00 PM, Sat - 24 February 24
పిల్లలు ఎంతో ఇష్టపడి తినే స్వీట్ ఐటమ్స్ లో మైసూర్ పాక్ కూడా ఒకటి. చాలామంది లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు తినే మైసూర్ పాక్ మాత్రమే కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటున్నారా. అయితే బీట్రూట్ తో మైసూర్ పాక్ ను సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
బీట్ రూట్ – రెండు
శెనగపిండి – ఒక కప్పు
చక్కెర – ఒక కప్పు
నెయ్యి – ఒకటిన్నర కప్పు
తయారీ విధానం :
బీట్రూట్ను సన్నగా తరిగి, మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. ఒక కప్పు జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి శెనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. స్టవ్ కట్టేశాక ఆ పిండిని జల్లెడ పట్టాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో నెయ్యి వేసి బాగా కలపాలి. అలా కలిపాక పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కళాయి పెట్టాలి. అందులో పంచదార, బీట్ రూట్ జ్యూస్ వేసి చిన్న మంట మీద తీగపాకం తీయాలి. తీగపాకం వచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి శనగపిండి మిశ్రమాన్ని వేసి కలపాలి. గరిటతో కలుపుతూనే ఉండాలి. అంతా బాగా కలిసాక ఒక అరకప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. వీటిలో నెయ్యి ఇగిరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యిని రాసి మిశ్రమాన్ని వేడిగా ఉండగానే అందులో వేయాలి. చల్లారే వరకు ఉంచి చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. అంతే నోరూరించే బీట్రూట్ మైసూర్ పాక్ రెడీ.
Related News
Blood: ఒంట్లో రక్తం తక్కువగా ఉందా.. అయితే ఉదయం పూట ఈ జ్యూస్ తాగాల్సిందే?
చాలామంది ప్రస్తుతం రక్తహీనత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఒంట్లో సరిగ్గా రక్తం లేక ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది