Wrestlers: రెజ్లర్లకు మద్దతుగా ఖాప్ నేతలు.. జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్ల (Wrestlers)కు మద్దతుగా ఖాప్ నేతలు (Khap’s) ఆదివారం (మే 7) జంతర్ మంతర్ (Jantar Mantar) చేరుకోనున్నారు.
- By Gopichand Published Date - 08:59 AM, Sun - 7 May 23
రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్ల (Wrestlers)కు మద్దతుగా ఖాప్ నేతలు (Khap’s) ఆదివారం (మే 7) జంతర్ మంతర్ (Jantar Mantar) చేరుకోనున్నారు. ఆదివారం వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న మల్లయోధులను సందర్శించి సంఘీభావం తెలుపుతారని ఖాప్ నేతలు ప్రకటించారు. భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన నరేష్ టికైత్, రాకేష్ టికైత్ కూడా చేరుకుంటారు. రాకేష్ టికైత్ ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ చేరుకోవచ్చు. రాత్రి 7గంటలకు ఖాప్ నాయకులు మల్లయోధులతో కలిసి క్యాండిల్ మార్చ్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద భారీ సంఖ్యలో RAF, CRPF, ఢిల్లీ పోలీసు సిబ్బందిని మోహరించారు. దీంతో పాటు పరిసర ప్రాంతాల్లో బారికేడింగ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు, పెట్రోలింగ్ను కూడా పెంచారు.
ఢిల్లీ సరిహద్దులో వాహనాల తనిఖీ
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చట్టాన్ని ఏ విధంగానూ ఉల్లంఘించకుండా చూసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. ఇలా చేసిన వారిని అదుపులోకి తీసుకుంటారు. సరిహద్దులో వాహనాలను తనిఖీ చేసి అందులో టెంట్ లేదా అలాంటి వస్తువులు కనిపిస్తే సీజ్ చేస్తారు. దీంతో పాటు వాహనాన్ని కూడా ఢిల్లీలోకి అనుమతించరు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులను కూడా మోహరిస్తారు.
Also Read: Jyeshtha Month 2023: హిందూ క్యాలెండర్లో మూడో నెల షురూ.. వ్రతాలు, పండుగల లిస్ట్ ఇదే
రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్త సమ్మె
ఆదివారం.. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని యునైటెడ్ కిసాన్ మోర్చాకు చెందిన వేలాది మంది రైతు నాయకులు జంతర్ మంతర్ చేరుకుని మల్లయోధులకు తమ మద్దతును అందిస్తారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. దీంతో పాటు మల్లయోధులకు మద్దతుగా దేశవ్యాప్త ప్రదర్శన కూడా నిర్వహించేందుకు రైతు సంఘం ప్లాన్ చేసింది. రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు, ఎందుకు అరెస్టు చేయడం లేదని ఖాప్ నేతలు అంటున్నారు.
మే 11-18 తేదీలలో అన్ని రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో రైతు సంఘాలు నిరసనలు తెలుపుతాయి. ఢిల్లీ పోలీసులు సున్నితత్వం ప్రదర్శించడం లేదని యునైటెడ్ కిసాన్ మోర్చా ఆరోపించింది. మల్లయోధుల ప్రాథమిక హక్కులను హరించడాన్ని ఖండించింది. ఏప్రిల్ 23 నుండి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న మల్లయోధులు ఢిల్లీ పోలీసులు తమను చాలాసార్లు వేధించారని ఆరోపించారు. మే 3న రెజ్లర్లకు, ఢిల్లీ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి పోలీసులు అనుమతించడం లేదని మల్లయోధులు ఆరోపించారు.
Related News
Pakistan Reaction: కేజ్రీవాల్ విడుదలతో పాకిస్థాన్ లో సంబురాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్ లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా డాన్ ఈ వార్తను ప్రచురించింది.కేజ్రీవాల్ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది. ఇది మోడీ ప్రభుత్వ ఓటమి అంటూ పాక్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు.