Woman raped: దారుణం.. మద్యం మత్తులో ఉన్న యువతిని రేప్ చేసిన ట్యాక్సీ డ్రైవర్
బెంగళూరులో దారుణం జరిగింది.
- By Gopichand Published Date - 07:38 PM, Tue - 29 November 22
బెంగళూరులో దారుణం జరిగింది. 22ఏళ్ల కేరళ యువతి శుక్రవారం అర్థరాత్రి బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆమె గమ్యస్థానానికి చేరిన తర్వాత బైక్ దిగే పరిస్థితిలో లేదు. దీనిని అవకాశంగా తీసుకున్న నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. తన ఫ్రెండ్ను పిలిచి, ఇద్దరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలతో ఆమె ఆస్పత్రిలో చేరగా వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ట్యాక్సీ ఎక్కిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు బైక్ ట్యాక్సీ డ్రైవర్, అతని స్నేహితుడిని బెంగళూరు సౌత్ ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన 22 ఏళ్ల మహిళ ఒక పనిపై బెంగళూరుకు వచ్చి నవంబర్ 24 గురువారం నాడు BTM లేఅవుట్ నుండి ఎలక్ట్రానిక్ సిటీకి బైక్ ట్యాక్సీని ఎక్కింది. రాపిడో డ్రైవర్ షాహబుద్దీన్ 22 ఏళ్ల బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం.. షహబుద్దీన్, అతని స్నేహితుడు అక్తర్ ఇంట్లో ఉన్న మహిళపై అత్యాచారం చేశారు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన యువతి ఫిర్యాదు చేసింది.
వీరిద్దరి స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఉన్న మహిళను కూడా అరెస్టు చేశారు. ఇతర నిందితులను రక్షించేందుకు ఆమె పోలీసులకు తప్పుడు సమాచారం అందించింది అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్-ఈస్ట్ డివిజన్ బెంగళూరు CK బాబా తెలిపారు. నివేదికల ప్రకారం.. ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లే మార్గంలో ఒక దుకాణం వద్ద ట్యాక్సీని ఆపినప్పుడు బాధితురాలితో షహబుద్దీన్ అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని యువతిని వారు బెదిరించారు.
Related News
Lok Sabha Polls 2024: ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడంతో, అనేక మంది భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, డ్రైవర్లు మరియు ఇతర వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లారు. అయితే ఇతర రంగాలపై ప్రభావం పెద్దగా కనిపించనప్పటికీ,