Banks: బ్యాంకులను ప్రైవేటీకరిస్తే సామాన్యులకు ఎంత నష్టమో!
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరిస్తూ వస్తున్నారు.
- By Hashtag U Published Date - 08:38 AM, Sat - 18 December 21
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరిస్తూ వస్తున్నారు. మరోపక్క మోదీ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని బ్యాంకు ఉద్యోగులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణతో ప్రజాధనానికి భద్రత లేకుండా పోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను పరిరక్షించుకోవటం దేశానికే అవసరమని వాళ్ళ అభిప్రాయం.
బ్యాంకులను ప్రయివేటీకటిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకులు ప్రయివేట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిస్తే ఆన్లైన్ సేవలపై ప్రత్యేక వడ్డింపులు ఉంటాయని, అకౌంట్ లో మెయింటైన్ చేయాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ విపరీతంగా పెంచుతారని బ్యాంకు ఉద్యోగ సంఘాలు చెపుతున్నాయి. ప్రభుత్వ అజామాయిషి లేకపోతే బ్యాంకులో ఉచిత సేవలు పూర్తిగా రద్దై , ప్రతి సేవకు పన్నుల. వసూలు చేసే అవకాశముంది. బుణాలపై వడ్డీరేట్లు భారీగా పెంచి, మరోపక్క డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీరేట్లను భారీగా తగ్గిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు కూడా అమల్లో ఉండవని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడు తక్కువ వడ్డీకి ఇచ్చే గృహ, విద్యా బుణాల వడ్డీరేట్లు కూడా భారీగా పెరుగుతాయని, ఖాతాదారుల డిపాజిట్లకు భద్రత ఉండదు. బ్యాంకుల్లో జవాబుదారీతనం అస్సలు ఉండకుండా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంకులను ప్రయివేటీకరిస్తే రైతులకు బుణాలు ఇవ్వరని దాంతో వ్యవసాయరంగ సంక్షోభం ఏర్పడే అవకాశముంది. ఇక చిరు వ్యాపారులకు, చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలకు కూడా బుణాలు ఇవ్వరని, ఇచ్చినా వడ్డీరేట్లు విపరీతంగా ఉంటాయని తద్వారా అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంకు ఉద్యోగసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు అవసరమైన సేవా రంగాలకు ఊతమిచ్చేందుకే మోడీ సర్కారు ఇండియాలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు తెర తీసిందని ఆర్థికవేత్తలు తెలిపారు. బ్యాంకుల ప్రయివేటీకరణ అందరిపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Tags
Related News
RBI New Rule: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ బ్యాంక్ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయా..?
బ్యాంకులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది.