HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Special
  • >Will Get Votes Only If Voters Are Intimidated This Is The New Trend Of Political Parties

Fear Politics : ఎన్నికల్లో పోటాపోటీగా ఫియర్ పాలి‘ట్రిక్స్’

2019 వరకు ఎన్నికలలో ఉచిత హామీలు, ఉద్వేగాలు, దేశ ప్రజల కలల సాకారం వంటి  అంశాలు కీలకంగా ఉండేవి.

  • By Pasha Published Date - 09:45 AM, Tue - 21 May 24
  • daily-hunt
Fear Politics
Fear Politics

Fear Politics : 2019 వరకు ఎన్నికలలో ఉచిత హామీలు, ఉద్వేగాలు, దేశ ప్రజల కలల సాకారం వంటి  అంశాలు కీలకంగా ఉండేవి. ఇప్పుడు సీన్ మారింది. ఓటర్లలో ‘భయం’ పుట్టించి ఓట్లు పొందే దిశగా ఈ ఎన్నికల్లో రాజకీయపార్టీలు పథక రచన చేశాయి.  ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఇదే బాటలో పయనించాయి. వివిధ పార్టీలు లేవనెత్తిన అంశాలు వేర్వేరు కావచ్చు.. కానీ వాటిలో ఉన్న కామన్ కంటెంట్ మాత్రం ‘భయం’. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

బీజేపీ ఏమేం చెప్పిందంటే.. 

ఫియర్ పాలిటిక్స్‌లో బీజేపీ ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డోజర్‌ను పంపుతారని స్వయంగా ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ఓ వర్గం ఓటర్లు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అంశంపై  కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే సహా, అగ్ర నేత రాహూల్ గాంధీ స్పందించాల్సి వచ్చింది. తాము గెలిచాక రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తుందని.. కశ్మీర్‌కు తిరిగి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుందని బీజేపీ ప్రచారం చేసింది. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పునరుద్ధరిస్తుందని బీజేపీ అంటోంది.  కాంగ్రెస్ పాలనలో దేశంలో బాంబులు పేలుతాయనే ప్రచారం కూడా కాషాయ పార్టీ చేసింది.

కాంగ్రెస్ ఏం చెబుతోంది ?

బీజేపీకి 400 సీట్లు వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జోరుగా  ప్రచారం చేసింది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి, మతదేశంగా భారత్‌ను ప్రకటిస్తుందని  కాంగ్రెస్ అంటోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. విపక్ష నేతలంతా జైళ్లలోకి వెళ్లడం ఖాయమని హస్తం పార్టీ చెబుతోంది. బీజేపీ ప్రభుత్వం వల్ల ఎదురయ్యే ముప్పుకు భయపడి తమకు ఓటు వేయాలనే పాచికను కాంగ్రెస్ వేసింది. అయితే అది ఫలితాన్ని ఇస్తుందా ? ఇవ్వదా ? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Also Read :BJP Candidates : బీజేపీ అభ్యర్థుల్లో ‘ఫిరాయింపు’ నేతలు ఎంతమంది తెలుసా ?

ఏపీ, తెలంగాణలో ఇలా.. 

  • ఏపీ ఎన్నికల్లోనూ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన కూడా ఫియర్ పాలి‘ట్రిక్స్‌’ను(Fear Politics) వాడుకున్నాయి. తమ ప్రభుత్వం ఏర్పడకపోతే సంక్షేమ పథకాల అమలు ఆగిపోతుందని వైఎస్సార్ సీపీ ప్రజలకు చెప్పింది.  టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలిగిపోతాయని, క్రైస్తవులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ప్రచారం చేసింది.
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఏపీలో హింస చెలరేగుతుందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రచారం చేసింది. జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అమలు చేస్తుందని ప్రజలకు చెప్పింది.
  • తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే, బీజేపీకి ఓటు వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచారంలో పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పోతాయన్నారు. బీఆర్ఎస్‌కు ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ కుటుంబానికి తప్ప తప్ప ఎవరికీ లాభం ఉండదని కాంగ్రెస్ చెప్పింది.

Also Read : Ebrahim Raisi : ఇరాన్ సుప్రీంలీడర్ పదవికి పోటీ.. రైసీ మరణంలో కొత్త కోణం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • elections 2024
  • Fear Politics
  • lok sabha
  • political parties
  • voters
  • votes

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd