Heatwave: ఈ రాష్ట్రాల్లోని ప్రజలను హెచ్చరించిన భారత వాతావరణ విభాగం.. ఎందుకంటే..?
ఏప్రిల్ ప్రారంభం కాగానే వేడి పెరగడం మొదలైంది. ఇదిలా ఉండగా భారత వాతావరణ విభాగం (IMD) హీట్ వేవ్ (Heatwave) గురించి హెచ్చరిక జారీ చేసింది.
- By Gopichand Published Date - 05:39 PM, Thu - 4 April 24
Heatwave: ఏప్రిల్ ప్రారంభం కాగానే వేడి పెరగడం మొదలైంది. ఇదిలా ఉండగా భారత వాతావరణ విభాగం (IMD) హీట్ వేవ్ (Heatwave) గురించి హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లో వేడి మరింత పెరుగుతుందని తెలిపింది. IMD ఓ వీడియోను విడుదల చేసింది. ఒడిశా, జార్ఖండ్, రాయలసీమ, పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రదేశాలలో ఏప్రిల్ 4-6, 2024 తేదీలలో వేడి గాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఇక్కడ కూడా వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అయితే ఉత్తర భారతదేశం సహా ఇతర రాష్ట్రాల్లో అంటే ఢిల్లీ, రాజస్థాన్, యూపీలో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఉండవని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ మొత్తంలో వాతావరణం ఎలా ఉంటుందో IMD ఇటీవల చెప్పింది. దీనికి సంబంధించి సమాచారం అందించారు.
• अप्रैल 2024 के दौरान, दक्षिण प्रायद्वीप के कई हिस्सों और उससे सटे उत्तर-पश्चिम मध्य भारत और पूर्वी भारत के कुछ हिस्सों और उत्तर-पश्चिम भारत के मैदानी इलाकों में सामान्य से अधिक उष्ण लहर/हीट वेव दिन रहने की संभावना है। pic.twitter.com/SkEsT9EcZM
— India Meteorological Department (@Indiametdept) April 1, 2024
ఏప్రిల్లో వాతావరణం ఎలా ఉంటుంది?
ఏప్రిల్- జూన్ మధ్య ఉత్తర మైదానాలతో సహా దక్షిణ భారతదేశంలో తీవ్రమైన వేడి, వేడి గాలులు ఉంటాయని వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది. వేవ్/హీట్ వేవ్ డే వచ్చే అవకాశం ఉందని IMD సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read: Ajith Kumar: షూటింగ్ లో హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. నెట్టింట వీడియో వైరల్!
ఏ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి?
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. మధ్య భారతదేశం, ఉత్తర మైదానాలు, దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వేడి గాలులు చాలా రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఈ రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
We’re now on WhatsApp : Click to Join
Related News
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.