HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >We Dont Want Any Alliance With Anyone Delhi Ex Minister

Atishi Marlena : మాకు ఎవరితో పొత్తు వద్దు – ఢిల్లీ మాజీ

Atishi Marlena : కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీతోనూ జతకట్టే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. గోవా, గుజరాత్‌లలో తమ పార్టీ బలంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని చెప్పారు

  • Author : Sudheer Date : 10-03-2025 - 10:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi Ex Cm Atishi
Delhi Ex Cm Atishi

ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంగా ప్రకటించింది. ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత అతిశీ (Atishi Marlena) మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ పూర్తిగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ,ఇప్పటి వరకు ఎవరితోనూ పొత్తుల గురించి చర్చించలేదని, కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీతోనూ జతకట్టే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. గోవా, గుజరాత్‌లలో తమ పార్టీ బలంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని చెప్పారు.

Bhupesh Baghel : మాజీ సీఎం ఇంట్లో IT రైట్స్

గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 11 మందిలో ఎనిమిది మంది బీజేపీలో చేరారని ఆమె అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు స్థానాలే మిగిలాయని, అలాంటి పరిస్థితిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అసంభవమని తెలిపారు. తాము అధికారంలోకి రావాలని కాక, ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని అతిశీ అన్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం జరిగినా, వారు ఇప్పటికీ పార్టీకి కట్టుబడి ఉన్నారని చెప్పారు.

AP Govt : విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి

ఢిల్లీలో ఆప్ ఓటమిపై కూడా ఆమె స్పందించారు. తమ పార్టీ ఓడిపోతే ప్రజలకు ముప్పే తప్ప తమకు ఏమీ నష్టం లేదని, అధికారంలోకి వచ్చిన బీజేపీ 250 మొహల్లా క్లినిక్‌లను మూసివేయాలనుకుంటోందని విమర్శించారు. ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్ ముందే హెచ్చరించినట్లుగా, ఆప్ ఓడితే విద్యుత్ కోతలు పెరుగుతాయని, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత తగ్గుతుందని అన్నారు. ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని, రాజకీయ లాభాలు తమకు ముఖ్యం కాదని ఆమె తేల్చి చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • Atishi Marlena
  • Goa Assembly Elections
  • gujarat

Related News

    Latest News

    • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

    • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

    • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

    • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

    • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

    Trending News

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd