వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)
భారతీయ రైల్వే ఈ ఏడాది జనవరిలో కూడా వందే భారత్ స్లీపర్ రైలులో ఇటువంటి వినూత్న పరీక్షను నిర్వహించింది. అప్పుడు కూడా 180 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి నీటి గ్లాసు ద్వారా స్థిరత్వాన్ని పరీక్షించారు.
- Author : Gopichand
Date : 30-12-2025 - 10:53 IST
Published By : Hashtagu Telugu Desk
Vande Bharat Sleeper: భారతీయ రైల్వే ప్రతి ఏటా సరికొత్త సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా వందే భారత్ స్లీపర్ రైలు, అందులోని అధునాతన సాంకేతికత, రైల్వే శాఖ ప్రమాణాలను ఎలా మెరుగుపరుచుకుంటుందో స్పష్టం చేస్తోంది.
180 కిలోమీటర్ల వేగంతో ‘వాటర్ టెస్ట్’
వందే భారత్ స్లీపర్ రైలులో రైల్వే సేఫ్టీ కమిషనర్ ఒక వినూత్నమైన పరీక్షను నిర్వహించారు. ఒక గ్లాసు నిండా నీరు పోసి, దానిపై మరో గ్లాసును ఉంచి ఈ పరీక్ష చేశారు. ఒకవైపు రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నా, ఆ గ్లాసులోని నీరు కనీసం ఒలకకపోవడం గమనార్హం. కొత్త తరం రైళ్ల సాంకేతిక నైపుణ్యాన్ని, స్థిరత్వాన్ని నిరూపించేందుకు రైల్వే శాఖ ఈ ‘వాటర్ టెస్ట్’ చేపట్టింది. ఈ ప్రయోగాత్మక పరీక్ష (ట్రయల్) రాజస్థాన్లోని కోటా-నాగ్దా రైల్వే సెక్షన్ మధ్య జరిగింది.
Also Read: టీ20 ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న మలింగ!
Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘X’ పోస్ట్
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. “రైల్వే భద్రతను, సాంకేతికతను అర్థం చేసుకోవడానికి ఇది ఒక విభిన్నమైన మార్గం. హైస్పీడ్ రైళ్ల యుగంలో వందే భారత్ నిరంతరం భారతీయ రైల్వే ప్రయాణికుల మొదటి ఎంపికగా మారుతోంది. దేశం సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్న క్రమంలో, భారత్ కూడా వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది” అని పేర్కొన్నారు.
గతంలోనూ ఇదే తరహా పరీక్ష
భారతీయ రైల్వే ఈ ఏడాది జనవరిలో కూడా వందే భారత్ స్లీపర్ రైలులో ఇటువంటి వినూత్న పరీక్షను నిర్వహించింది. అప్పుడు కూడా 180 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి నీటి గ్లాసు ద్వారా స్థిరత్వాన్ని పరీక్షించారు. ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశ్యం ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమేనని మంత్రి వివరించారు. 180 కి.మీ వేగంతో వెళ్తున్నా నీటి చుక్క కూడా ఒలకడం లేదంటే, ప్రయాణికులకు ఆ ప్రయాణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.