Swati Maliwal Case: రేపు కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఢిల్లీ పోలీసులు గురువారం తన తల్లిదండ్రులను విచారించేందుకు వస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఢిల్లీ పోలీసులు తన తల్లిదండ్రులను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో కేజ్రీవాల్ చెప్పనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసుకు సంబంధించి
- Author : Praveen Aluthuru
Date : 23-05-2024 - 12:26 IST
Published By : Hashtagu Telugu Desk
Swati Maliwal Case: ఢిల్లీ పోలీసులు గురువారం తన తల్లిదండ్రులను విచారించేందుకు వస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఢిల్లీ పోలీసులు తన తల్లిదండ్రులను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో కేజ్రీవాల్ చెప్పనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసుకు సంబంధించి అధికారులు ఆయన నివాసాన్ని సందర్శించనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా.. రేపు ఢిల్లీ పోలీసులు అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రులను విచారించడానికి వస్తారు అని పోస్ట్లో తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విషయమై కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని ఆప్ వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రి నివాసంలో వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి కేజ్రీవాల్ తల్లిదండ్రులు మరియు భార్యను కలవడానికి పోలీసు అధికారులు సమయం కోరినట్లు వర్గాలు తెలిపాయి. గత వారం స్వాతి మలివాల్ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లగా ఆమెపై కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశాడని ఆరోపించడంతో రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు.
మే 13న ఆమె కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి అల్పాహారం చేస్తున్న అతని తల్లిదండ్రులు మరియు భార్యను కలిసినట్లు మాలివాల్ తన ప్రకటనలో పేర్కొన్న తర్వాత కేజ్రీవాల్ తల్లిదండ్రులు మరియు భార్యను ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో రేపు పోలీసులు మళ్లీ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి అతని తల్లిదండ్రులు మరియు అతని భార్య స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం ఉంది.
Also Read: Kerala Rains: భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్