HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Terrorist Attacks May Occur In The Country Intelligence Agencies Warn

Intelligence sources : దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక !

డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి.

  • By Latha Suma Published Date - 12:58 PM, Sat - 12 April 25
  • daily-hunt
Terror Attacks
Terror Attacks

Intelligence sources : దేశంలో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం. డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి.

ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని సూచించింది. కాగా పాకిస్థాన్ తీవ్రవాదులు 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారానే ముంబయిలోకి ప్రవేశించి సీఎస్ఎంటీ, ఒబెరాయి ట్రైడెంట్, తాజ్ హోటల్ లో మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే తహవూర్ రాణాను భారత్ ప్రస్తుతం విచారిస్తోంది. ఈ విచారణలో అతడు చెప్పబోయే సమచారం కీలకం కాబోతున్నది. ముఖ్యమంగా పాకిస్థాన్ కుట్రలు బయహిర్గతం అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

2008 నవంబర్ 29 వరకు ఈ మారణహోమం కొనసాగింది. ఈ ఉగ్రదాడుల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులతో పోరాడుతూ అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు. కాగా రాణా పాకిస్థాన్‌ మూలాలున్న కెనడా జాతీయుడు. డేవిడ్ హెడ్లీతోపాటు 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు.

Read Also: Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం!

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Drone Attacks
  • India Security Alert
  • Indian Intelligence Agencies
  • Pakistan-sponsored Terrorism
  • terrorist attacks

Related News

    Latest News

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd