NIA Team : పశ్చిమబెంగాల్ కలకలం..NIA బృందంపై దాడి
- By Latha Suma Published Date - 12:19 PM, Sat - 6 April 24
NIA Team Attacked In West Bengal : పశ్చిమబెంగాల్ (West Bengal)లో జాతీయ దర్యాప్తు సంస్థ( (National Investigation Agency) (NIA) వాహనంపై దాడి జరిగింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనాన్ని ఓ గుంపు చట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పేలుడు కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ (Medinipur జిల్లాలోని భూపతినగర్(Bhupatinagar) ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తమ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్ఐఏ తెలిపినట్లు ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ చెప్పారు. దీనిపై ఎన్ఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.
#WATCH | West Bengal: NIA officers had to face protesters in Bhupatinagar while they were carrying out an investigation in connection with the Bhupatinagar, East Medinipur blast case. People allegedly tried to stop the NIA team from taking the accused persons along with them.… pic.twitter.com/KKL33S4Plm
— ANI (@ANI) April 6, 2024
ఎన్ఐఏ అధికారుల వాహనంపై దాడి చేసిన గుంపు నిందితులను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. అరెస్టు చేసిన నిందితులతో, ఎన్ఐఏ అధికారులు ఉన్న భూపతినగర్కు భారీగా కేంద్ర బలగాలు చేరుకుంటున్నాయి. 2022 డిసెంబర్ 3న భూపతినగర్లో జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, జనవరిలో ఈ తరహా ఘటన బంగాల్లో జరిగింది. రేషన్ పంపిణీ స్కామ్ కేసులో ఉత్తర 24 పరగణాలు జిల్లా సందేశ్ఖాలీలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఎంసీ మద్దతుదారులు- ఈడీ అధికారులతో పాటు వారి వెంట వచ్చిన కేంద్ర బలగాలను చుట్టుముట్టారు. అనంతరం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ అధికారుల వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీకి చెందిన ఇద్దరు అధికారులు గాయపడ్డారు.
Read Also:YS Sunitha Reddy : షర్మిలను జగన్ అందుకే పక్కన పెట్టారు : వైఎస్ సునీత
రేషన్ పంపిణీ స్కామ్ కేసులో ఇదివరకే అరెస్టయిన రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియో మల్లిక్కు షేక్ షాజహాన్ అత్యంత సన్నిహితుడు అని అధికారులు తెలిపారు. ‘ఎనిమిది మంది దుండగులు ఘటనాస్థలికి వచ్చారు. మా బృందంలోని ముగ్గురు సభ్యులం అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాము. ఈ క్రమంలో వారు మాపై దాడికి దిగారు’ అని దాడి సమయంలో ఈడీ బృందంలో ఉన్న సభ్యుడు తెలిపారు.
Related News
Teacher Recruitment Case:: సీఎం మమతకు బిగ్ షాక్.. వేల ఉద్యోగాలు రద్దు
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కలకత్తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్పై సోమవారం తీర్పు వెలువరిస్తూ 2016 మొత్తం ప్యానెల్ను రద్దు చేయాలని ఆదేశించింది.