AAP : స్వాతి మలివాల్పై దాడి కేసు..నేడు కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలిసులు
- By Latha Suma Published Date - 12:09 PM, Thu - 23 May 24
![AAP : స్వాతి మలివాల్పై దాడి కేసు..నేడు కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలిసులు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/1111-1.jpg)
Kejriwal’s parents: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై దాడి చేశాడంటూ ఆరోపణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి ఫిర్యాదుతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే, ఈ కేసులో కేజ్రీవాల్ తల్లిదండ్రులను(Kejriwal’s parents) కూడా ఈరోజు ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం ఢిల్లీ పోలీసులు సివిల్ లైన్స్ ప్రాంతంలోని సీఎం నివాసానికి చేరుకొని కేజ్రీ తల్లిదండ్రులను ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో సీఎం తల్లిదండ్రులతోపాటు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
Read Also: Karimnagar – Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లి.. గెస్టులకు గిఫ్టుగా కరీంనగర్ ఫిలిగ్రీ ప్రోడక్ట్స్
మరోవైపు స్వాతి మలివాల్(Swati Maliwal) మీద దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) బుధవారం తొలిసారి స్పందించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ అంశం విచారణ దశలో ఉన్నందున తాను స్పందిస్తే విచారణపై ప్రభావం పడుతుందని అన్నారు. అయితే, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని, న్యాయం చేయాలని మాత్రం తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రెండు రకాల వాదనలు ఉన్నందున పోలీసులు ఇరువైపుల వాదనలపై విచారణ జరిపి, న్యాయం చేయాలని పేర్కొన్నారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Arvind Kejriwal: హెల్త్ చెకప్ సమయంలో సునీతా కేజ్రీవాల్ను అనుమతించాలి: సీఎం కేజ్రీవాల్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Arvind-Kejriwal.jpg)
Arvind Kejriwal: హెల్త్ చెకప్ సమయంలో సునీతా కేజ్రీవాల్ను అనుమతించాలి: సీఎం కేజ్రీవాల్
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీ కోర్టు శుక్రవారం జూన్ 19కి వాయిదా వేసింది. రోస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వైద్య కారణాలతో ఏడు రోజుల మధ్యంతర బెయిల్ను కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ఇటీవల తిరస్కరించారు.