HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Supreme Court Is A Bigot To Ed Why Are You Being Used For Politics

Supreme Court : ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు..మిమ్మల్ని రాజకీయాలకు ఎందుకు వాడుతున్నారు?

సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లు ఈ కేసును విచారించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ పోరాటాల కోసం ఈడీని వాడడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.

  • By Latha Suma Published Date - 01:27 PM, Mon - 21 July 25
  • daily-hunt
Supreme Court is a bigot to ED..why are you being used for politics?
Supreme Court is a bigot to ED..why are you being used for politics?

Supreme Court: కర్ణాటకలో రాజకీయాలకు తెరలేపిన మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కుంభకోణం కేసులో, కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED)కు సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదురైంది. సీఎం సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేసిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది. సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లు ఈ కేసును విచారించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ పోరాటాల కోసం ఈడీని వాడడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.

Read Also: PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ

చీఫ్ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ..దురదృష్టవశాత్తూ మాకు మహారాష్ట్రలో ఇదే తరహా అనుభవం ఉంది. మేము మాట్లాడేటట్లు ఒత్తిడి చేయొద్దు. అలా చేస్తే ఈడీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సివస్తుంది అని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పోరాటాలు జరగటం సహజం. కానీ వాటికోసం అధికార సంస్థలను ఎందుకు వాడుతున్నారు? అని ఆయన అడిగారు. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు స్పందిస్తూ, ఈడీ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటుందని ప్రకటించారు. తద్వారా, కోర్టు పిటిషన్‌ను అధికారికంగా తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎటువంటి తప్పులేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వివాదం యొక్క మూలం 2021లో మొదలైంది. మైసూరు జిల్లా కెసరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి చెందిన మూడు ఎకరాల భూమిని మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా స్వాధీనం చేసుకుంది. భూమి నష్ట పరిహారంగా ముడా, విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను ఆమెకు కేటాయించింది.

అయితే విజయనగరలో భూమి ధరలు కెసరెతో పోల్చితే చాలా ఎక్కువ కావడంతో, ఇది వివాదానికి దారితీసింది. ఆపై పార్వతి తనకు కేటాయించిన భూమిని స్వచ్ఛందంగా తిరిగి ముడాకు అప్పగించారు. అయినప్పటికీ ఈడీ ఈ వ్యవహారంలో ఆమెపై సమన్లు జారీ చేసింది. దీనిపై ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న ఈడీ సమన్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. తాజాగా, సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ ఈడీ అప్పీల్‌ను కొట్టివేయడం ముఖ్య పరిణామంగా మారింది. ఇది కేవలం చట్టపరమైన విషయమే కాకుండా, రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అంశంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ తీర్పుతో కేంద్ర సంస్థలు ఎలా పని చేస్తున్నాయన్న ప్రశ్న మరోసారి వెలుగులోకి వచ్చింది. కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్ష నేతలపై మార్గదర్సిగా వాడుతున్నారన్న విమర్శల నేపథ్యంలో, ఈ తీర్పు ప్రభుత్వం తీరుపై విమర్శలకు వేదిక కల్పించేలా ఉంది.

Read Also: Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్‌లో రామ్మోహన్‌ నాయుడు వివరణ

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chief Justice Gavai
  • enforcement directorate
  • karnataka politics
  • MUDA
  • Political wars
  • Supreme Court

Related News

Betting apps case.. Shikhar Dhawan for ED investigation!

Shikhar Dhawan : బెట్టింగ్‌ యాప్స్‌ కేసు.. ఈడీ విచారణకు శిఖర్ ధావన్‌ !

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ విచారణ కోసం ఈడీ ఎదుట హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ధావన్‌కు పీఎంఎల్‌ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద విచారణ నోటీసులు జారీ చేయబడటంతో ఆయన ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు.

  • Harish Bjp

    Controversial Comments : హరీష్ వివాదస్పద వ్యాఖ్యలు.. జిల్లా ఎస్పీ కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా అంటూ..

  • Four years of locality mandatory for medical students: Supreme Court

    Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు

Latest News

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd