Seema : కోర్టుకెక్కిన మొదటి భర్త.. పాక్ వనిత సీమా హైదర్కు సమన్లు
- Author : Latha Suma
Date : 16-04-2024 - 2:13 IST
Published By : Hashtagu Telugu Desk
Seema Haider: గత ఏడాది తన ప్రేమికుడి కోసం అక్రమంగా భారత్కు వచ్చిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్కు నోయిడాలోని ఫ్యామిలీ కోర్టు(Noida Family Court) సమన్లు(summons) జారీ చేసింది. సీమా హైదర్ గత ఏడాది మేలో తన నలుగురు మైనర్ పిల్లలతో కలిసి భారత్లోకి చొరబడి నోయిడా వ్యక్తి సచిన్ మీనాను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి చెల్లుబాటు కాదంటూ ఆమె మొదటి భర్త గులాం హైదర్ ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సీమా హైదర్కు నోటీసులు పంపింది. మే 27న కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను మే 27కు వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, సీమా హైదర్ మరియు భారతదేశంలో ఆమె భాగస్వామి సచిన్ మీనా – మొబైల్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు పేమలో పడ్డారు. అనంతరం వారిద్దరూ నేపాల్లో ఖాట్మండులో పెళ్లి చేసుకున్నారు. గత నెలలో ఇద్దరూ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారని గులాం హైదర్ తన పిటిషన్లో పెర్కోన్నారు. గులాం హైదర్ తన పిల్లల మత మార్పిడిని కూడా సవాలు చేశాడు.
Read Also: KCR House: కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కష్టాల్లో గులాబీ బాస్
గులాం హైదర్ నుంచి సీమా విడాకులు తీసుకోలేదని, సచిన్తో ఆమె వివాహం చెల్లదని గులాం హైదర్ తరఫు న్యాయవాది మోమిన్ మాలిక్ వాదించారు. మే 27న కోర్టుకు హాజరుకావాలని హైదర్ను కోరింది. గులాం హైదర్ తన నలుగురు పిల్లలను కస్టడీలో ఉంచడంలో సహాయం కోసం మొదట పాకిస్తానీ అగ్ర న్యాయవాది మరియు మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీని సంప్రదించాడు.
Read Also: Shankar : దర్శకుడు శంకర్ కూతురి రిసెప్షన్లో.. చరణ్, చిరుతో పాటు జాన్వీ కపూర్
పాకిస్థాన్కు చెందిన అగ్రశ్రేణి న్యాయవాది మరియు మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ.. సీమా పాకిస్థాన్ భర్త గులాం హైదర్ తన నలుగురు పిల్లలను కస్టడీ చేయడంలో సహాయం కోసం తనను సంప్రదించారని చెప్పారు. బర్నీ ఆ తర్వాత భారతదేశంలో అలీ మోమిన్ను నియమించుకున్నాడు మరియు భారతీయ న్యాయస్థానాలలో న్యాయపరమైన విచారణలను ప్రారంభించడానికి అతనికి పవర్ ఆఫ్ అటార్నీని పంపాడు.