HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sonia Gandhi Formed Five Members Committee

Congress: ఇక త‌గ్గేదేలే అంటున్న‌ సోనియా గాంధీ

  • Author : HashtagU Desk Date : 17-03-2022 - 4:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sonia Gandhi
Sonia Gandhi Congress

దేశంలో ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజ‌యాన్ని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ప‌త‌న స్థాయికి చేరుకుందో అర్ధ‌మవుతోంది. క‌నీసం పంజాబ్‌లో అయినా అధికారం నిలబెట్టుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు ఊహించ‌ని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్‌ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఈ నేప‌ధ్యంలో కచ్చితంగా పంజాబ్‌లో గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు అక్కడ కూడా ప్రతికూల ఫలితాలు రావడం ఆ పార్టీ హైకమాండ్‌ జీర్ణించుకోలేకపోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే పార్టీకి తీవ్ర నష్టం కల్గడంతో చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ప‌రాభ‌వానికి గ‌ల కార‌ణాలు అన్వేషించే ప‌నిలో ప‌డింది. ఈ క్ర‌మంలో లోపాల‌ను చ‌క్క‌దిద్దే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సోనియా గాంధీ, 2024 నాటికి పార్టీని ప‌టిష్టం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

మొద‌ట ఐదు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్‌లుగా ఉన్నవారిని తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయ‌మ‌న్న సోనియా గాంధీ, అదే క్ర‌మంలో పార్టీ ఓటమి విశ్లేషణ కోసం ఐదుగురు సీనియర్ నేతలను రంగంలోకి దించారు. ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థిలను విశ్లేషించి, సంస్థాగతంగా చేయాల్సిన మార్పులనూ ఈ కమిటీ సూచన చేస్తుంది.

ఇందులోభాగంగా పార్టీ సీనియర్ నేత అజయ్ మకెన్‌‌కు పంజాబ్ బాధ్యతలను అప్పగించిన సోనియా గాంధీ, మణిపూర్ బాధ్యతలను జైరామ్ రమేష్, గోవాకు రజిని పాటిల్, ఉత్తరప్రదేశ్‌కు జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్‌కు అవినాష్ పాండేలను నియమించారు. ఈ కమిటీ సభ్యులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడి, వారి నుంచి సమాచారం సేకరించి, వాస్తవిక‌ పరిస్థితులతోపాటు సంస్థాగతంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపై వారు నివేదిక అందచేస్తారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అన్నా కాంగ్రెస్ పుంజుకుంటుందో లేదో చూడాలి. ఏది ఏమైనా స్వ‌యంకృతాప‌రాధంతో ఎన్నిక‌ల్లో బోల్తా కొట్టిన త‌ర్వాత ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటే ఏం లాభ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • india
  • Priyanka gandhi
  • Rahil Gandhi
  • sonia gandhi

Related News

Record Vehicle Sales In Jan

జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

గత ఏడాది (2025) జనవరి నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 12.6 శాతం వృద్ధిని సూచిస్తోంది. సాధారణంగా ఏడాది ఆరంభంలో కొత్త మోడల్స్ మరియు రిజిస్ట్రేషన్ ఇయర్ మారుతుందనే కారణంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారు, అయితే ఈసారి నమోదైన గణాంకాలు పరిశ్రమ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి

  • Priyanka Gandhi

    రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ప్రియాంక గాంధీ!

  • T20 World Cup

    పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

  • T20 World Cup

    టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

  • Elon Musk

    జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

Latest News

  • ఇంట్లో దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి?

  • ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు..ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి ?

  • అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?

  • 2025 లో మన దేశంలో మొత్తం ఎన్ని విమాన ప్రమాదాలు జరిగాయో తెలుసా ?

  • అంబటి ఇంటిపై దాడి ఘటన, టీడీపీ నేతలపై కేసు నమోదు

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd