HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Small Chip Made In India Has The Power To Change The World Pm Modi

PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు.

  • By Latha Suma Published Date - 12:57 PM, Tue - 2 September 25
  • daily-hunt
PM Modi
Small chip made in India has the power to change the world: PM Modi

PM Modi : ప్రపంచాన్ని శాసించబోయే సాంకేతిక విప్లవానికి భారత్‌లో తయారవుతున్న చిన్న చిప్‌నే కేంద్రబిందువుగా మార్చే దిశగా దేశం ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి ధీమా వ్యక్తం చేశారు. (సెప్టెంబర్ 2) మంగళవారం నాడు జరిగిన ‘ఇండియా సెమీకాన్ 2025’ ప్రారంభోత్సవంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు. గత శతాబ్దం పెట్రోలియం ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఆధిపత్యం వహించిందని, అయితే 21వ శతాబ్దంలో సెమీకండక్టర్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువవుతాయని పేర్కొన్నారు.

Read Also: AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ

ఒకప్పుడు దేశాల శక్తి చమురు బావులపై ఆధారపడింది. కానీ ఇప్పుడు, ప్రపంచం చిన్నచిన్ని చిప్‌లలో దాగిన మేధస్సుపై ఆధారపడుతోంది. పరిమాణంలో చిన్నదైనా, ఈ చిప్‌లో ప్రపంచాన్ని వేగంగా ముందుకు నడిపించే శక్తి ఉంది అని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి 40కి పైగా దేశాల ప్రతినిధులు హాజరుకావడం, భారత యువతలోని ప్రతిభ, ఆవిష్కరణలపై ప్రపంచ విశ్వాసానికి ప్రతీక అని ప్రధాని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను నమ్ముతోంది. భారత్‌తో కలిసి సెమీకండక్టర్ రంగంలో భవిష్యత్ నిర్మాణం చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తోంది అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ విలువ సుమారు 600 బిలియన్ డాలర్లుగా ఉందని, ఈ మార్కెట్ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేసినట్లు మోడీ గుర్తు చేశారు. ఇదే కారణంగా ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు భారత్‌పైనే నిలిచిందని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు మన దేశం బ్యాక్‌ఎండ్ పనులకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు, డిజైన్ నుంచి తయారీ దాకా పూర్తి విలువ శ్రేణిని కవర్ చేసే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోంది అని తెలిపారు. ఈ రంగంలో స్థిరమైన పురోగతికి తమ ప్రభుత్వం తీసుకున్న దీర్ఘకాలిక విధానాలు కీలకంగా మారాయని వివరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండో దశ సెమీకండక్టర్ మిషన్‌పై దృష్టి పెట్టిందని, దీని ద్వారా మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రధాని వెల్లడించారు. భవిష్యత్తులో ‘డిజైన్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా’ అన్న పదాలే భారత్‌ గుర్తింపుగా నిలవబోతున్నాయి అని మోడీ గట్టిగా చెప్పారు. ఇలా భారత ప్రభుత్వ వ్యూహాత్మక నూతన ఆలోచనలు, యువత ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాల మేళవింపు ద్వారా భారత్ త్వరలోనే గ్లోబల్ సెమీకండక్టర్ రంగంలో కీలక ప్లేయర్‌గా ఎదిగే మార్గంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Read Also: Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్‌ రైలులో చైనాకు కిమ్‌.. అమెరికాకు బలమైన సంకేతం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chip manufacturing
  • Design in India
  • India semiconductor mission
  • indian economy
  • Make In India
  • pm modi
  • Semicon 2025
  • Semiconductor industry
  • semiconductor market
  • technology

Related News

Indian Girl

Indian Girl: చైనాలో భార‌త మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!

థోంగ్డోక్ ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఆమె జన్మస్థలంగా అరుణాచల్ ప్రదేశ్ నమోదు చేయబడి ఉండటాన్ని చూసి, చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె భారతీయ పాస్‌పోర్ట్‌ను అమాన్యం చేశారు.

  • Modi Speech

    PM Modi At G20 Summit: జీ20 సదస్సులో తన మార్క్ చూపించిన ప్రధాని మోదీ

  • Sarvam AI

    Sarvam AI: భార‌త ఏఐ రంగంలో చారిత్రక ఘట్టం.. స్వదేశీ LLM త్వరలో ఆవిష్కరణ!

  • Nitish Kumar

    Nitish Kumar: 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం!

  • Nitish Kumar

    Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!

Latest News

  • Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

  • India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు క‌ష్ట‌మేనా?!

  • Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

  • Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

  • H5N5 Virus: కరోనా తర్వాత ప్రపంచంలోకి కొత్త వైరస్!

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd