HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Singer Ks Chithra Faces Backlash For Social Media Post On Ayodhya Event

Singer Chithra – Ayodhya : రామమందిర ప్రారంభోత్సవంపై సింగర్ చిత్ర వీడియో సందేశం.. పెదవి విరిచిన నెటిజన్స్

Singer Chithra - Ayodhya : ‘‘అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమ సమయంలో దేశ ప్రజలు రాముడి శ్లోకాలను జపించాలి’’ అని ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర రెండు రోజుల క్రితం ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • By Pasha Published Date - 07:33 PM, Tue - 16 January 24
  • daily-hunt
Singer Chithra Ayodhya
Singer Chithra Ayodhya

Singer Chithra – Ayodhya : ‘‘అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమ సమయంలో దేశ ప్రజలు రాముడి శ్లోకాలను జపించాలి’’ అని ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర రెండు రోజుల క్రితం ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఈ పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతీ ఒక్కరు మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరామ జయ రామ జయజయ రామ మంత్రాన్ని జపించాలి. అదే రోజు సాయంత్రం ప్రజలు తమ ఇళ్లలో ఐదు వత్తుల దీపాలను వెలిగించాలి. ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు’’ అని ఆ వీడియో సందేశంలో కేఎస్ చిత్ర పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే సింగర్ చిత్ర(Singer Chithra – Ayodhya) ఇలా పిలుపునివ్వడాన్ని నెటిజన్లలో ఓ వర్గానికి నచ్చలేదు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా చిత్ర రాజకీయంగా వ్యవహరించారని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. మరో వర్గం నెటిజన్లు చిత్ర వ్యక్తీకరించిన భావాలకు తమ మద్దతు తెలిపారు. సింగర్ చిత్రకు కూడా భావాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు కేరళలోని త్రిసూర్‌లో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో నటి శోభన వేదికను పంచుకోవడాన్ని ఒక వర్గం నెటిజన్స్ తీవ్రంగా విమర్శించారు.

Also Read: 10th Cheetah Died : చనిపోయిన పదో చీతా.. మరణానికి కారణమేంటి ?

అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు ప్రారంభమై జనవరి 21 వరకు నిరంతరాయంగా జరుగుతాయి. జనవరి 16న ఆలయ ట్రస్ట్ నియమించిన ప్రతినిధి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం, విష్ణుపూజ, గోపూజ జరుగుతాయి. జనవరి 17న  రామ్‌లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు ఆలయానికి చేరతారు. జనవరి 18న  గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలతో సంప్రదాయ క్రతువులు ప్రారంభమవుతాయి. జనవరి 19న  యజ్ఞం ప్రారంభం అవుతుంది. తర్వాత ‘నవగ్రహ’ ‘హవన్’ స్థాపన నిర్వహిస్తారు. జనవరి 20న రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్లతో శుభ్రం చేస్తారు. తర్వాత వాస్తు శాంతి ‘అన్నాదివస్‌’ ఆచారాలను పండితులు నిర్వహిస్తారు. జనవరి 21న రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22న ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 7 వేల మందికి ఆలయ ట్రస్టు ఆహ్వానాలు పంపింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayodhya Event
  • Ayodhya Ram Mandir
  • Singer Chithra - Ayodhya
  • Singer KS Chithra
  • social media

Related News

TikTok re-entering India?.. Speculations are abound with job postings

TikTok : భారత్‌లోకి టిక్‌టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ

2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టిక్‌టాక్ భారత్‌లో అప్రత్యక్షంగా కూడా పని చేయడం లేదు. కానీ తాజాగా టిక్‌టాక్ వెబ్‌సైట్‌కు యాక్సెస్ సాధ్యమవుతున్నట్టు పలువురు నెటిజన్లు చెబుతుండటం, అలాగే లింక్డిన్‌లో ఉద్యోగాల ప్రకటనలొచ్చిన నేపథ్యంలో, ఈ ప్లాట్‌ఫారమ్ మళ్లీ భారత్‌లోక

    Latest News

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd