Road Accidents : దేశ వ్యాప్తంగా గంటకు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో..ఎంతమంది చనిపోతున్నారో తెలుసా..?
దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి, రవాణాశాఖ నివేదికను విడుదల చేసింది.
- Author : Sudheer
Date : 01-11-2023 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
నిత్యం రోడ్డు ప్రమాదాలు (Road Accidents) అమాయకపు ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. అతివేగం..మద్యంమత్తులో డ్రైవింగ్ ..నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చే వరకు ఇంట్లో వారికీ టెన్షనే. ఈ క్రమంలో దేశం (India)లో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి, రవాణాశాఖ నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం 2021 సంవత్సరం కంటే 2022 సంవత్సరంలో 11.9% ప్రమాదాలు, 9.4% మరణాలు, 15.3% క్షతగాత్రుల సంఖ్య పెరిగిందని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం గంటకు 53 ప్రమాదాలు జరుగగా.. 19 మంది మరణిస్తున్నారని తెలిపి షాక్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రమాదాల పరంగా, మరణాల పరంగా ముందు వరసలో ఉన్న 10 రాష్ట్రాల పేర్లను నివేదికలో పేర్కొంది.
ప్రమాదాల పరంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు తొలి పది స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాగా మరణాల పరంగా చూస్తే ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి పదిస్థానాల్లో నిలిచినట్లు నివేదిక లో తెలిపింది.
Read Also : Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో అతి చిన్న వయస్కురాలు ఆమె..!