HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Railways Restore Passenger Train Fares

Indian Railways : రైలు ప్ర‌యాణికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఊర‌ట‌

  • By Latha Suma Published Date - 04:19 PM, Tue - 27 February 24
  • daily-hunt
Railway Project
Railway Project

 

Indian Railways : రైలు ప్ర‌యాణికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం(Central Govt) ఊర‌ట‌నిచ్చింది. ఎక్స్‌ప్రెస్ స్పెష‌ల్‌గా మార్చిన ప్యాసింజ‌ర్ రైళ్ల‌(Passenger trains)లోని సెకండ్ క్లాస్ ఆర్డిన‌రీ ఛార్జీల‌(Second Class Ordinary harges)ను ఫిబ్ర‌వ‌రి 27 నుంచి పునరుద్ధ‌రించింది(Restored)కేంద్రం. క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత ఇండియ‌న్ రైల్వేస్.. ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను పేర్ల‌ను మార్చ‌డం ప్రారంభించింది. ఆ పేర్ల‌కు త‌గ్గ‌ట్టుగా ఛార్జీలు వ‌సూలు చేస్తుండ‌టంతో ఆర్డిన‌రీ ఛార్జీలు పూర్తిగా మాయమ‌య్యాయి. దీంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు క‌నీస టికెట్‌ను ధ‌ర రూ. 10 నుంచి రూ. 30కు పెంచ‌డంపై విమ‌ర్శ‌లు వెలువెత్తాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం రైల్వే బోర్డు స‌మీక్ష నిర్వ‌హించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

తాజాగా సెకండ్ క్లాస్ ఆర్డిన‌రీ రైళ్ల(Second Class Ordinary Trains)క‌నీస టికెట్ ధ‌ర‌ను పాత రేట్లులానే వ‌సూలు చేయాల‌నేది ది చీఫ్ బుకింగ్ రిజ‌ర్వేష‌న్ అధికారుల‌కు మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున స‌మాచారం అందింది. మెయిన్ లైన్ ఎల‌క్ట్రిక్ మ‌ల్టిపుల్ యూనిట్(ఎంఈఎంయూ)లో ఆర్డిన‌రీ క్లాస్ టికెట్ ధ‌ర‌లు 50 శాతం వ‌ర‌కు త‌గ్గాయి. సాధార‌ణంగా ఈ రైలు నంబ‌ర్లు సున్నాతో మొద‌ల‌వుతుంటాయి. అన్ రిజ‌ర్వ్‌డ్ ట్రాకింగ్ సిస్ట‌మ్‌లోనూ వీటి ధ‌ర‌లు అప్‌డేట్ చేశారు. గ‌తంలో ప్యాసింజ‌ర్ రైళ్లుగా సేవ‌లందించి ఆ త‌ర్వాత ఎక్స్‌ప్రెస్ స్పెష‌ల్స్‌గా మారిన అన్నింటికీ ఈ మార్పు వ‌ర్తిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

జూన్ 2022లో నైరుతీ రైల్వే మొత్తం 8 ప్యాసింజ‌ర్ స్పెష‌ల్స్‌ను అన్ రిజ‌ర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. 2021 ఏప్రిల్‌లో 20 రైళ్ల‌ను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. 200 కిలోమీట‌ర్ల దూరానికి మించి ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను న‌డ‌ప‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. 2020లో మొత్తం 502 ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను మార్చాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

read also : Bengaluru Metro : బట్టలు బాగోలేవంటూ రైతును మెట్రో ఎక్కనివ్వని అధికారులు..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • express trains
  • indian railways
  • Ordinary Charges
  • Ordinary Trains

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd