Radhika Khera: మద్యం ఇచ్చి అనుచితంగా ప్రవర్తించారు అంటూ రాధికా సంచలనం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాధికా ఖేడా ఛత్తీస్గఢ్ రాజకీయాలపై సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. పార్టీలోని పలువురు అగ్ర నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కార్యాలయంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని ఆమె చెప్పారు
- By Praveen Aluthuru Published Date - 02:51 PM, Mon - 6 May 24
Radhika Khera: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాధికా ఖేడా ఛత్తీస్గఢ్ రాజకీయాలపై సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. పార్టీలోని పలువురు అగ్ర నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కార్యాలయంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని ఆమె చెప్పారు.
#WATCH | Delhi: On her resignation from the Congress party, Radhika Khera says "I always heard that Congress is anti-Ram, anti-Sanatan and anti-Hindu but I never believed it. Mahatma Gandhi used to start every meeting with 'Raghupati Raghav Raja Ram'. I got exposed to the reality… pic.twitter.com/bIWBut1UFZ
— ANI (@ANI) May 6, 2024
“కాంగ్రెస్ అంటే రాముడికి వ్యతిరేకమని, సనాతన వ్యతిరేకమని, హిందూ వ్యతిరేకమని నేను ఎప్పటినుండో విన్నాను, కానీ నేను దానిని నమ్మలేదు. మహాత్మా గాంధీ ప్రతి సమావేశాన్ని రఘుపతి రాఘవ రాజా రామ్ భజనతో ప్రారంభించేవారు. నేను మా అమ్మమ్మతో కలిసి రామాలయానికి వెళ్లి, అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత, నేను వాస్తవికతను ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. నా ఇంటి గుమ్మానికి జై శ్రీరామ్ జెండా పెట్టాను, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ద్వేషించడం ప్రారంభించింది. నేను ఫోటోలు, వీడియోలు పెట్టినప్పుడల్లా అయోధ్యకు ఎందుకు వెళ్లావని కాంగ్రెస్ నేతలు తనను ప్రశ్నించేవారని ఆమె చెప్పారు.
We’re now on WhatsApp : Click to Join
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ సుశీల్ ఆనంద్ శుక్లా నాకు మద్యం అందించారని ఈ రోజు ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అతను 5-6 మంది పార్టీ కార్యకర్తలతో కలిసి నా గది తలుపు తట్టాడు. నేను ఈ విషయాన్ని సచిన్ పైలట్, దీపక్ బైజ్ మరియు జైరామ్ రమేష్, పవన్ ఖేడాకు తెలియజేశాను కానీ వాళ్ళు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో రాధిక వివిధ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన తర్వాత పార్టీలో తనపై వ్యతిరేకత మొదలైందని, ఆ తర్వాత తనపై కూడా అసభ్యకరంగా ప్రవర్తించారని రాధికా ఖేడా పేర్కొంది. రాయ్పూర్లోని పార్టీ కార్యాలయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని ఉటంకిస్తూ చెప్పింది. రాముడి భక్తురాలిగా, మహిళగా చాలా బాధపడ్డానని రాధిక తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
Also Read: Kannappa Akshay Kumar : వారం రోజుల షూటింగ్ కు అన్ని కోట్లా.. కన్నప్పలో అక్షయ్ రెమ్యునరేషన్ లీక్..!
Tags
Related News
Murder in Chhattisgarh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య.. ఆపై నిందితుడు ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గొడ్డలితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి, ఆపై ఉరి వేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.