PM MODI: జమ్మూకశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారు.!!
- By hashtagu Published Date - 07:36 AM, Mon - 31 October 22
ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదివారం జమ్మూ కశ్మీర్ లోని రోజ్ గర్ మేళాను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు. అవినీతి వ్యవస్థను దేశం నుంచి తరిమికొట్టేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. నియామక పత్రాలు పొందిన యువత పారదర్శకతను ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనో జ్ సిన్హా, ప్రతిభావంతులైన యువకులను నియామక పత్రాలను అందజేశారు. ఉపాధి మేళా మొదటి దశ సందర్భంగా ఆదివారం మూడువేల నియామక పత్రాలను పంపిణీ చేశారు.
గత మూడేళ్లలో యువత, రైతులు, మహిళల సాధికారతలో యూనియన్ టెరిటరీ వేగవంతమైన పురోగతిని సాధించిందన్నారు సిన్హా. వ్యవస్థాపకత, స్వయం ఉపాధికోసం సహాయక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలను అభివ్రుద్ధి చేశామన్నారు. గడిచిన మూడేళ్లలో 30,000మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలుకల్పించామని చెప్పారు. 5.2 లక్షల మందికి స్వయం ఉపాధి అవకాలు కల్పించామని…5.5 లక్షల మందికిపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారని మనోజ్ సిన్హా అన్నారు.
జమ్మూ కశ్మీర్ లో నేడు తయారీ, సేవా రంగం ఈ రెండింటిలోనూ స్వయం ఉపాధి కోసం విస్తృత అవకాశాలను అందిస్తున్నట్లు చెప్పారు. వికేంద్రీకృత పద్ధతిలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు శిక్షణ, క్రెడిట్, మార్కెట్ యాక్సెస్ ,సాంకేతిక ఇన్పుట్లతో యువ పారిశ్రామికవేత్తలకు సాయం అందిస్తున్నట్లు స్పష్టంచేశారు.
Related News
BJP Operation Broom: బీజేపీ ఆపేరేషన్ బ్రూమ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని ఉద్దేశించారని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఇందు కోసం బీజేపీ ఆపేరేషన్ బ్రూమ్ ని ప్రవేశపెట్టిందని చెప్పారు